News March 24, 2025
కరీంనగర్: డిప్లమో కోర్సులో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

టెక్స్ టైల్ టెక్నాలజీ డిప్లమో కోర్సులలో ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు కరీంనగర్ జిల్లా జౌలి చేనేత శాఖ సహాయ సంచాలకులు సోమవారం తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో నూతనంగా మంజూరైన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ హైదరాబాద్ నందు మొదటి సంవత్సరానికి 60 సీట్లు ఉన్నాయన్నారు. 10వ తరగతి ఉత్తీర్ణులైన వారు అర్హులన్నారు. ఆసక్తి గలవారు ఏప్రిల్ మొదటి వారంలోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు.
Similar News
News November 8, 2025
మ్యాచ్ రద్దు.. సిరీస్ భారత్ కైవసం

ఆస్ట్రేలియాతో జరగాల్సిన చివరి టీ20 వర్షం కారణంగా రద్దయింది. తొలి ఓవర్ నుంచే దూకుడుగా ఆడిన భారత్ 4.5 ఓవర్లలో 52 రన్స్ చేసింది. ఈ క్రమంలోనే మొదలైన వర్షం పెద్దదైంది. దీంతో ఆట సాధ్యం కాదని అంపైర్లు ప్రకటించారు. ఇప్పటికే 2-1 తేడాతో ముందంజలో ఉన్న భారత్ సిరీస్ను కైవసం చేసుకుంది. తొలి టీ20 కూడా వర్షం వల్ల రద్దు కాగా రెండో మ్యాచులో ఆసీస్.. మూడు, నాలుగో టీ20ల్లో ఇండియా గెలిచింది.
News November 8, 2025
KMM: ఐటీ – వ్యవసాయం మేళవింపులో రాష్ట్రానికే ఆదర్శం

నూకలంపాడు రాష్ట్రంలోనే ఆదర్శంగా నిలుస్తోంది. ఇక్కడ ప్రతి ఇంట్లో ఓ కుమారుడు సాఫ్ట్వేర్ ఇంజినీర్, ఐటీలో పనిచేస్తుండగా, మరో కుమారుడు వ్యవసాయం చేస్తూ పొలాన్ని నమ్ముకుని ఉండటం విశేషం. ఆధునిక సాంకేతికతతో సంపాదన, భూమిపై ప్రేమను బ్యాలెన్స్ చేస్తూ ఈ రెండు రంగాల్లో రాణిస్తున్నారు. ఒకరు సాంకేతికతతో, మరొకరు వ్యవసాయంతో ఆర్థిక స్థిరత్వాన్ని సాధిస్తూ ఈ గ్రామం ఇతర గ్రామాలకు స్ఫూర్తినిస్తోంది.
News November 8, 2025
మాలిలో ఐదుగురు ఇండియన్ కార్మికుల కిడ్నాప్

ఆఫ్రికన్ కంట్రీ మాలిలో ఓ కంపెనీలో పనిచేస్తున్న ఐదుగురు ఇండియన్ కార్మికుల్ని దుండగులు కిడ్నాప్ చేశారు. వెస్ట్రన్ మాలిలోని కోబ్రీలో విద్యుదీకరణ ప్రాజెక్టు పనుల్లో వారుండగా ఇది జరిగినట్లు భద్రతావర్గాలు AFPకి తెలిపాయి. మిగతా కార్మికుల్ని రాజధాని బమాకోకు తరలించారు. అల్ఖైదాతో సంబంధాలున్న JNIM జిహాదీలు ఇటీవల ముగ్గురిని అపహరించి $50Mలు తీసుకొని విడిచిపెట్టారు. తాజా ఘటనపై ఇంకా ఏ సంస్థా స్పందించలేదు.


