News October 10, 2024
కరీంనగర్: తమ్ముడిని చంపిన అన్న

కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం దుద్దెనపల్లిలో మంగళవారం అర్ధరాత్రి తమ్ముడిని అన్న చంపిన విషయం తెలిసిందే. పోలీసుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన ప్రేమలత-రాజయ్యకు కుమారులు కుమారస్వామి, చంద్రయ్య. వీరు వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నారు. కాగా, వీరి మధ్య కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. ఈక్రమంలో చంద్రయ్య మద్యం తాగి అన్నతో గొడవకు దిగాడు. ఆవేశంతో కుమారస్వామి ఇనుపరాడ్తో దాడి చేయగా చంద్రయ్య చనిపోయాడు.
Similar News
News December 2, 2025
నామినేషన్ కేంద్రాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్

కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం నుస్తులాపూర్, కొత్తపల్లి గ్రామపంచాయతి లలో రెండవ విడత నామినేషన్ల ప్రక్రియను జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి పరిశీలించారు. ఈ సందర్భంగా సంబంధిత అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. నామినేషన్లను క్షుణ్ణంగా పరిశీలించాలని సూచించారు. ఆమె వెంట జిల్లా అధికారులు సిబ్బంది ఉన్నారు.
News December 2, 2025
నామినేషన్ కేంద్రాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్

కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం నుస్తులాపూర్, కొత్తపల్లి గ్రామపంచాయతి లలో రెండవ విడత నామినేషన్ల ప్రక్రియను జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి పరిశీలించారు. ఈ సందర్భంగా సంబంధిత అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. నామినేషన్లను క్షుణ్ణంగా పరిశీలించాలని సూచించారు. ఆమె వెంట జిల్లా అధికారులు సిబ్బంది ఉన్నారు.
News December 2, 2025
జీటీఏ కరీంనగర్ నూతన అధ్యక్షుడిగా రవీందర్ ఎన్నిక

ప్రభుత్వ ఉపాధ్యాయ సంఘం (GTA) కరీంనగర్ జిల్లా నూతన అధ్యక్షుడిగా గాజుల రవీందర్, ప్రధాన కార్యదర్శినిగా చంద్రశేఖర్ రెడ్డి ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సర్వీస్ రూల్స్ ఏర్పాటు చేయడంలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొంటామన్నారు. భవిష్యత్తులో సంఘం నిర్వహించే ప్రతి కార్యక్రమానికి ప్రతి ప్రభుత్వ ఉపాధ్యాయుడు హార్ధికంగా, ఆర్థికంగా సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా, మండల బాధ్యులు పాల్గొన్నారు.


