News February 16, 2025
కరీంనగర్: తల్లి, ఇద్దరు పిల్లల మృతిపై ఎస్సై వివరాల వెల్లడి

ఇద్దరు పిల్లలతో సహా తల్లి ఆత్మహత్య చేసుకున్న ఘటనపై జగిత్యాల జిల్లా పెగడపల్లి ఎస్ఐ రవి కిరణ్ కరీంనగర్లో మీడియాతో వివరాలు వెల్లడించారు. జగిత్యాల జిల్లా మద్దులపల్లి గ్రామానికి చెందిన <<15478542>>హారిక<<>> ఇద్దరు పిల్లలకు పురుగుల మందు తాగించి తాను తాగిందని చెప్పారు. హైదరాబాద్లో చికిత్స పొందుతూ తల్లి హారిక మృతిచెందగా, ఇద్దరు పిల్లలు కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో మృతి చెందినట్లు తెలిపారు.
Similar News
News December 4, 2025
NRPT: ‘నషా ముక్త్ భారత్’ అవగాహన వాహనం ప్రారంభం

మాదక ద్రవ్యాల నిర్మూలనపై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు బ్రహ్మకుమారీల సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘నషా ముక్త్ భారత్’ కార్యక్రమంలో భాగంగా ప్రత్యేక ప్రచార వాహనాన్ని గురువారం కలెక్టరేట్ ప్రాంగణంలో కలెక్టర్ సిక్తా పట్నాయక్ జెండా ఊపి ప్రారంభించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. యువత చెడు అలవాట్లు, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలన్నారు. సమాజ అభివృద్ధికి మాదక ద్రవ్యాల నిర్మూలన అత్యంత కీలకమన్నారు.
News December 4, 2025
ఎల్లుండి నుంచి APP పరీక్షల హాల్ టికెట్లు

TG: 118 అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ (APP) పోస్టుల పరీక్షా హాల్ టికెట్లను ఈ నెల 6వ తేదీ ఉ.8గం. నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని TSLPRB ప్రకటించింది. 13వ తేదీ రాత్రి 12గం. వరకు సైట్లో అందుబాటులో ఉంటాయని తెలిపింది. ఈనెల 14న రాత పరీక్షలు నిర్వహిస్తామని పేర్కొంది. ఉ.10గం. నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పేపర్-1(ఆబ్జెక్టివ్), మధ్యాహ్నం 2.30 నుంచి 5.30గం. వరకు పేపర్-2(డిస్క్రిప్టివ్) ఉంటాయని తెలిపింది.
News December 4, 2025
APPLY NOW: టెక్నికల్ సపోర్ట్ ఉద్యోగాలు

<


