News February 16, 2025
కరీంనగర్: తల్లి, ఇద్దరు పిల్లల మృతిపై ఎస్సై వివరాల వెల్లడి

ఇద్దరు పిల్లలతో సహా తల్లి ఆత్మహత్య చేసుకున్న ఘటనపై జగిత్యాల జిల్లా పెగడపల్లి ఎస్ఐ రవి కిరణ్ కరీంనగర్లో మీడియాతో వివరాలు వెల్లడించారు. జగిత్యాల జిల్లా మద్దులపల్లి గ్రామానికి చెందిన <<15478542>>హారిక<<>> ఇద్దరు పిల్లలకు పురుగుల మందు తాగించి తాను తాగిందని చెప్పారు. హైదరాబాద్లో చికిత్స పొందుతూ తల్లి హారిక మృతిచెందగా, ఇద్దరు పిల్లలు కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో మృతి చెందినట్లు తెలిపారు.
Similar News
News March 28, 2025
అబద్ధాలు చెప్పడంలో చంద్రబాబు పెద్దవాడు: అంబటి

AP: అబద్ధాలు చెప్పడంలో CM చంద్రబాబు అందరికంటే పెద్దవారని, నిజాలు చెప్పడంలో చిన్న వారని YCP నేత అంబటి రాంబాబు విమర్శించారు. ‘పోలవరం ప్రాజెక్టును సర్వనాశనం చేసింది చంద్రబాబే. ప్రాజెక్టు నిధులను జగన్ రాష్ట్ర ప్రభుత్వానికి మళ్లించారని ఆయన ఆరోపిస్తున్నారు. ఇది నిజమని నిరూపిస్తే సాష్టాంగ నమస్కారం చేస్తా. కేంద్రం కట్టాల్సిన ప్రాజెక్టును మేమే కడతామని CBN ఎందుకు ఒప్పందం చేసుకున్నారు?’ అని ప్రశ్నించారు.
News March 28, 2025
జగిత్యాల: వరి కొనుగోలు కేంద్రాలలో మౌలిక వసతులు కల్పించాలి

రాబోయే యాసంగికి వరిధాన్యం కొనుగోలు కేంద్రాలలో మౌలిక వసతులు కల్పించాలని అడిషనల్ కలెక్టర్ బిఎస్.లత అన్నారు. జగిత్యాల కలెక్టరేట్లో ధాన్యం కొనుగోలు కమిటీ సభ్యులతో గురువారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో మాట్లాడారు. కేంద్రాలలో తాగునీరు, టాయిలెట్స్, విద్యుత్ కనెక్షన్, ఆన్లైన్ వసతి ఉండాలన్నారు. ఎప్పటికప్పుడు మిల్లుకు వచ్చిన లారీని త్వరితగతిన దిగుమతి చేసుకోవాలని సూచించారు. పలువురు అధికారులు పాల్గొన్నారు.
News March 28, 2025
మరింత పెరగనున్న ఉష్ణోగ్రతలు!

TG: ఇవాళ్టి నుంచి మరో 5 రోజులపాటు రాష్ట్రంలో పొడి వాతావరణం ఏర్పడుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాబోయే 3 రోజుల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు క్రమంగా 2 నుంచి 3 డిగ్రీల వరకు పెరగొచ్చని అంచనా వేసింది. పలు జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 41-44 డిగ్రీల మధ్య, మరికొన్ని జిల్లాల్లో 36-40 డిగ్రీల మధ్య నమోదయ్యే అవకాశం ఉన్నట్లు తెలిపింది.