News February 13, 2025
కరీంనగర్: దత్తత ఉత్తర్వులు అందించిన కలెక్టర్

మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ పరిధిలోని కరీంనగర్ శిశు గృహం నుంచి పిల్లలను దత్తత తీసుకున్న దంపతులకు జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ఈరోజు కలెక్టరేట్లో దత్తత ఉత్తర్వులు అందజేశారు. శిశు గృహం నుంచి ఐదుగురు మగ శిశువులను, నలుగురు ఆడ శిశువులను వరంగల్, సిద్దిపేట, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, నల్గొండ జిల్లాలకు చెందిన పిల్లలు లేని దంపతులు దత్తత తీసుకున్నారు.
Similar News
News November 1, 2025
మందమర్రి: ఏరియాలో 65% బొగ్గు ఉత్పత్తి

అక్టోబర్ నెలకు గాను మందమర్రి ఏరియాలో నిర్దేశించిన లక్ష్యానికి 65% బొగ్గు ఉత్పత్తి సాధించామని జీఎం రాధాకృష్ణ చెప్పారు. బొగ్గు ఉత్పత్తి వివరాలను శుక్రవారం వెల్లడించారు. భూగర్భ గనుల కార్మికుల గైర్హాజర్ మూలంగా ఆశించిన బొగ్గు ఉత్పత్తి సాధించడం లేదన్నారు. రానున్న రోజుల్లో బొగ్గు ఉత్పత్తి లక్ష్యానికి చేరుకుంటామని ఆశాభావం వ్యక్తం చేశారు. అధికారులు సూపర్వైజర్లు సమష్టిగా కృషి చేయాలన్నారు.
News November 1, 2025
ప్రపంచ దృష్టిని ఆకర్షించేలా ప్రజా పాలన విజయోత్సవాలు: Dy.CM

TG రైజింగ్, రాష్ట్ర ఆవిర్భావం, అభివృద్ధి అంశాలు కలగలిపి ఒక సమగ్ర ప్రణాళికతో ప్రపంచ దృష్టిని ఆకర్షించేలా ప్రజా పాలన విజయోత్సవాలు (DEC 1-9) నిర్వహించాలని Dy.CM భట్టి అన్నారు. భవిష్యత్తులో TG ఏం సాధించబోతుందనే విషయాలను ప్రపంచానికి వివరించేలా కార్యక్రమాలు ఉండాలని సమీక్ష సమావేశంలో అధికారులకు సూచించారు. విజయోత్సవాలకు పెట్టుబడిదారులను ఆహ్వానిస్తున్నామని, భారీగా MOUలు జరిగేలా వాతావరణం ఉండాలన్నారు.
News November 1, 2025
హెడ్మాస్టర్లు, ఉపాధ్యాయులు హెడ్క్వార్టర్స్లోనే ఉండాలి: KMR DEO

జుక్కల్ నియోజకవర్గంలో కొందరు ఉపాధ్యాయులు హెడ్క్వార్టర్స్లో ఉండటం లేదని, పాఠశాల సమయాల్లో బయటకు వెళ్తున్నారని MLA కాంతారావు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై కామారెడ్డి జిల్లా విద్యాధికారి ఎస్.రాజు అన్ని మండల విద్యాధికారులు, హెడ్మాస్టర్లు, ఉపాధ్యాయులు తప్పనిసరిగా హెడ్క్వార్టర్స్లోనే ఉండాలని, పాఠశాల సమయాల్లో స్కూల్ వదిలి వెళ్లకూడదని ఉత్తర్వులు జారీ చేశారు.


