News February 13, 2025
కరీంనగర్: దత్తత ఉత్తర్వులు అందించిన కలెక్టర్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739443952146_60382139-normal-WIFI.webp)
మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ పరిధిలోని కరీంనగర్ శిశు గృహం నుంచి పిల్లలను దత్తత తీసుకున్న దంపతులకు జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ఈరోజు కలెక్టరేట్లో దత్తత ఉత్తర్వులు అందజేశారు. శిశు గృహం నుంచి ఐదుగురు మగ శిశువులను, నలుగురు ఆడ శిశువులను వరంగల్, సిద్దిపేట, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, నల్గొండ జిల్లాలకు చెందిన పిల్లలు లేని దంపతులు దత్తత తీసుకున్నారు.
Similar News
News February 14, 2025
దామరగిద్ద: జపాన్లో ప్రదర్శనకు ఎంపిక విద్యార్థి ఆవిష్కరణ
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739437887019_51550452-normal-WIFI.webp)
దామరగిద్ద గురుకుల పాఠశాలకు చెందిన శివారెడ్డి తయారు చేసిన కోకోనట్ ఫైబర్ పాట్స్ ప్రాజెక్టును డిల్లీలో జరిగిన జాతీయ స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలో ప్రదర్శించారు. ఈ ఎగ్జిబిట్స్ జపాన్లో జరిగే సకురా ప్రోగ్రామ్కు ఎంపికైనట్లు గైడ్ టీచర్ జరీనా బేగం తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా విద్యాశాఖ అధికారి గోవిందరాజు విద్యార్థిని, గైడ్ టీచర్ను అభినందించారు. రాష్ట్రం నుంచి 4 ప్రాజెక్టులు ఎంపికైనట్లు చెప్పారు.
News February 14, 2025
ఒక్క డోర్ మాత్రమే తెరచి ఉండేలా చూడాలి: కలెక్టర్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739451392458_19090094-normal-WIFI.webp)
ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి అనకాపల్లి జివిఎంసి ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ కేంద్రం, బ్యాలెట్ బాక్స్లను భద్రపరిచే స్ట్రాంగ్ రూమ్ను కలెక్టర్ విజయకృష్ణన్ గురువారం పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. డిస్ట్రిబ్యూషన్ రిసెప్షన్ కేంద్రాల్లో ఎటువంటి లోటుపాట్లు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. స్ట్రాంగ్ రూమ్కు ఒక్క డోర్ మాత్రమే తెరచి ఉండేలా చూడాలన్నారు.
News February 14, 2025
NZB: ఒంటరి మహిళ మెడలోంచి గొలుసు అపహరణ
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739467359698_50486028-normal-WIFI.webp)
NZBలో ఒంటరిగా ఉన్న ఓ వృద్ధురాలి మెడలో నుంచి దుండగుడు బంగారు గొలుసును అపహరించుకు వెళ్లాడు. ఈ ఘటన గురువారం సాయంత్రం చోటు చేసుకుంది. వీక్లీ మార్కెట్కు చెందిన విజయ ఇంట్లో ఒంటరిగా ఉంటుంది. ఇదే అదునుగా భావించిన దుండగుడు ఇంట్లోకి ప్రవేశించి మహిళ మెడలో నుంచి మూడున్నర తులాల బంగారు గొలుసును లాక్కొని పారిపోయాడు. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు వన్ టౌన్ ఎస్ఐ మొగులయ్య తెలిపారు.