News September 6, 2024

కరీంనగర్: నిప్పంటించుకుని ఒకరి ఆత్మహత్య

image

కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని ఇందిరానగర్ గ్రామ శివారులో ఓ వ్యక్తి ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఎల్ఎండి SI వివేక్ వివరాల ప్రకారం.. KNRలోని గణేశ్ నగర్‌లో నివాసం ఉంటున్న సత్తు రఘు(48) పట్టణంలోని ఓ హోటల్లో అకౌంటెంట్‌గా పనిచేస్తున్నాడు. ఇంటి నుంచి బయలుదేరి ఇందిరా నగర్ గ్రామ శివారులో పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటనకు గల కారణాలు తెలియాల్సి ఉంది. 

Similar News

News February 24, 2026

చార్మినార్ భాగ్యలక్ష్మి గుడికి కరీంనగర్ కార్పొరేటర్లు, కౌన్సిలర్లు

image

కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో ఎన్నికైన కార్పొరేటర్లు, కౌన్సిలర్లు నేడు పాతబస్తీలోని భాగ్యలక్ష్మీ ఆలయాన్ని దర్శించుకోనున్నారు. ఉదయం నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సమావేశమైన అనంతరం, కేంద్ర మంత్రి బండి సంజయ్, రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావులతో కలిసి ఆలయంలో ప్రత్యేక పూజలు చేస్తారు. అనంతరం లాల్ దర్వాజ మహంకాళి ఆలయాన్ని సందర్శించి, స్థానిక నాయకులతో భోజన కార్యక్రమంలో పాల్గొంటారు.

News February 24, 2026

KNR: ఆన్‌లైన్ హాల్ టికెట్‌తో అనుమతి

image

ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు ఈ నెల 25 నుంచి ప్రారంభం కానున్నాయి. జిల్లాలో 36,426 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. 57 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. పరీక్షలు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు జరుగుతాయి. ప్రిన్సిపల్ సంతకం లేకపోయినా ఆన్‌లైన్ హాల్ టికెట్‌తోనే పరీక్షలకు హాజరుకావచ్చని RIEO గంగాధర్ స్పష్టం చేశారు.

News February 23, 2026

కరీంనగర్ పోలీస్ దళంలోకి రెండు కొత్త డాగ్స్

image

నేర పరిశోధనను మరింత వేగవంతం చేసేందుకు కరీంనగర్ కమిషనరేట్ పోలీస్ దళంలోకి రెండు నూతన పోలీస్ డాగ్స్ చేరాయి. HYD లోని ఐ.ఐ.టి.ఏ (IITA) కేంద్రంలో 9 నెలల పాటు కఠిన శిక్షణ పూర్తి చేసుకున్న రోలెక్స్ (ట్రాకర్), మాక్స్ (స్నిఫర్) పోలీస్ కమిషనర్ కార్యాలయంలో రిపోర్ట్ చేశాయి. వీటి రాకతో జిల్లాలో భద్రత వ్యవస్థ మరింత మెరుగుపడుతుందన్నారు.