News June 28, 2024
కరీంనగర్: నియామకపత్రం అందుకున్నా ‘నో జాబ్’!

నియామకపత్రం అందుకున్నప్పటికీ ఓ అభ్యర్థిని ఉద్యోగానికి దూరమైంది. కరీంనగర్ (D) గంగాధర (M) నారాయణపూర్కు చెందిన భానుప్రియ గురుకులంలో PGT గణితం దివ్యాంగుల కోటాలో ఎంపికై నియామకపత్రం అందుకుంది. 40% వైకల్యం ఉన్నవారు దివ్యాంగులుగా అర్హులు కాగా ఆమెకు 68% ఉన్నట్లు సదరం క్యాంపులో గుర్తించారు.అయితే తాజా వైద్య పరీక్షల్లో 39% వైకల్యం ఉందని తేలడంతో ఆమె ఉద్యోగానికి అనర్హురాలంటూ తేల్చారు. న్యాయం చేయాలని కోరుతోంది.
Similar News
News December 16, 2025
కరీంనగర్: 454 మందికి రేపు అగ్ని పరీక్ష

కరీంనగర్ జిల్లాలో మూడో దఫా గ్రామపంచాయతీ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. 108 గ్రామాలలో 454 మంది అభ్యర్థులు సర్పంచ్ స్థానాలకు పోటీపడుతున్నారు. హుజూరాబాద్, ఇల్లందకుంట, జమ్మికుంట, సైదాపూర్, వీణవంక మండలాల్లోని 108 సర్పంచ్, 1034 వార్డులకు రేపు ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం ఐదు మండలాలలో 1,59,647 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
News December 16, 2025
KNR: మార్చిలోగా అమృత్-2 పనులు పూర్తి చేయాలి: సీడీఎంఏ

కరీంనగర్ జిల్లాలో అమృత్-2 పథకం కింద చేపట్టిన మంచినీటి సరఫరా పనులను మార్చిలోగా వేగవంతంగా పూర్తి చేయాలని సీడీఎంఏ శ్రీదేవి కమిషనర్లను ఆదేశించారు. పైప్లైన్, రిజర్వాయర్ల నిర్మాణాల పురోగతిపై ఆమె వీడియో కాన్ఫరెన్స్లో సమీక్షించారు. పనులు ఆలస్యం చేస్తున్న కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాలని, వారానికి ఒకసారి పురోగతిని వెబ్సైట్లో అప్లోడ్ చేయాలని ఆమె స్పష్టం చేశారు.
News December 16, 2025
KNR: మార్చిలోగా అమృత్-2 పనులు పూర్తి చేయాలి: సీడీఎంఏ

కరీంనగర్ జిల్లాలో అమృత్-2 పథకం కింద చేపట్టిన మంచినీటి సరఫరా పనులను మార్చిలోగా వేగవంతంగా పూర్తి చేయాలని సీడీఎంఏ శ్రీదేవి కమిషనర్లను ఆదేశించారు. పైప్లైన్, రిజర్వాయర్ల నిర్మాణాల పురోగతిపై ఆమె వీడియో కాన్ఫరెన్స్లో సమీక్షించారు. పనులు ఆలస్యం చేస్తున్న కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాలని, వారానికి ఒకసారి పురోగతిని వెబ్సైట్లో అప్లోడ్ చేయాలని ఆమె స్పష్టం చేశారు.


