News March 7, 2025

కరీంనగర్: నూతన సీపీ గౌస్ ఆలం బయోడేటా

image

KNR నూతన సీపీ గౌస్ ఆలం బిహార్‌లోని గయాలో జన్మించారు. IIT ముంబైలో మెకానికల్ ఇంజినీరింగ్ పూర్తిచేశారు. 2017 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన గౌస్ ఆలం శిక్షణలో పరేడ్ కమాండర్‌గా వ్యవహరించి బెస్ట్ అల్‌రౌండర్ అవార్డు సాధించారు. మొట్టమొదటగా ఏటూరునాగారం ASP విధులు నిర్వహించారు. అనంతరం ఖమ్మం OSDగా పనిచేశారు. 2022లో ములుగు SPగా పనిచేశారు. 2024 జనవరిలో ADB SPగా బాధ్యతలు స్వీకరించి.. 2025 MAR 7న KNRకు బదిలీపై వచ్చారు.

Similar News

News October 31, 2025

కరీంనగర్ జిల్లాలో 34వేల ఎకరాల్లో పంట నష్టం

image

రెండు రోజులుగా కురుస్తున్న వర్షాల ప్రభావంతో కరీంనగర్ జిల్లాలో పంటలు దెబ్బతిన్నాయి. వ్యవసాయ శాఖ ప్రాథమిక అంచనా ప్రకారం 183 గ్రామాల్లో 29,797 మంది రైతులకు చెందిన 34,127 ఎకరాల్లో పంట నష్టం జరిగింది. వీటిలో 30,565 ఎకరాల్లో వరి, 3,512 ఎకరాల్లో పత్తి, 50 ఎకరాల్లో మక్కపంటలు దెబ్బతిన్నాయి. HZB డివిజన్‌లోనే ఎక్కువ నష్టం వాటిల్లింది. అధికారులు పరిస్థితిని సమీక్షించి ప్రభుత్వానికి నివేదిక సమర్పించనున్నారు.

News October 31, 2025

కరీంనగర్ జిల్లాకు నేడు CM..!

image

మొంథా తుఫాన్ ప్రభావంతో దెబ్బతిన్న పంటలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెలికాప్టర్ ద్వారా ఇవాళ మధ్యాహ్నం ఏరియల్ సర్వే చేయనున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలోని హుస్నాబాద్, చిగురుమామిడి, సైదాపూర్ ప్రాంతాల్లో నష్టపోయిన ప్రాంతాలను పరిశీలించి హుజూరాబాద్ మీదుగా వరంగల్ జిల్లాకు చేరుకోనున్నారు. అనంతరం హనుమకొండ కలెక్టరేట్లో ఏరియల్ సర్వే చేసిన ప్రాంతాల్లో జరిగిన నష్టంపై అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు.

News October 31, 2025

దంపతుల గల్లంతు.. మృతదేహాలు లభ్యం

image

సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం మోత్కులపల్లి వాగులో వరద ప్రవాహానికి హనుమకొండ జిల్లా భీమదేవరపల్లికి చెందిన <<18150389>>దంపతులు<<>> ఈసంపల్లి ప్రణయ్(28), కల్పన(24) గల్లంతైన విషయం తెలిసిందే. దీంతో గాలింపు చేపట్టిన పోలీసులు ఇవాళ ఉదయం దంపతుల మృతదేహాలను గుర్తించారు. కాగా, ప్రణయ్, కల్పనను విగతజీవులుగా చూసిన బాధిత కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు.