News April 17, 2025
కరీంనగర్: నేటి నుంచి అవగాహన సదస్సులు

భూభారతి నూతన రెవేన్యూ చట్టంపై ప్రజలకు అవగాహన కల్పించాలనే రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు కరీంనగర్ జిల్లాలోని అన్ని మండలాల్లో అవగాహన సదస్సులు నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం శ్రీకారం చుట్టింది. ఈ నేపథ్యంలో ఈ నెల 17 నుంచి 30వ తేదీ వరకు జిల్లా పరిధిలోని వివిధ మండలాల్లో నిర్వహించే సదస్సులకు సంబంధించిన ప్రణాళిక సిద్ధం చేసింది.
Similar News
News December 20, 2025
KNR: ఓవర్సీస్ స్కాలర్ షిప్లకు దరఖాస్తుల ఆహ్వానం

జిల్లాలోని మైనారీటీ విద్యార్థులు విదేశాల్లో విద్య నభ్యసించేందుకు 2025 ఓవర్సీస్ స్కాలర్ షిప్కు దరఖాస్తులు చేసుకోవాలని సంక్షేమ అధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. పీజీ, పిహెచ్డి చేయుటకు జనవరి 19 లోగా వెబ్ సైట్లో దరఖాస్తు చేసుకోవాలని, సంబంధిత ధ్రువీకరణ పత్రాలు ఫిబ్రవరి 20 వరకు కరీంనగర్ జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ కార్యాలయంలో అందజేయాలన్నారు. మరిన్ని వివరాలకు 87829 57085 నంబర్ సంప్రదించాలని కోరారు.
News December 20, 2025
విద్యార్థులందరికీ దంత పరీక్షలు: కలెక్టర్ పమేలా సత్పతి

కరీంనగర్ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులెవరూ దంత సమస్యలతో బాధపడకూడదని కలెక్టర్ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు. శుక్రవారం కరీంనగర్ ప్రధాన ఆస్పత్రిలో విద్యార్థుల చికిత్స తీరును ఆమె పరిశీలించారు. ఇప్పటివరకు 12 వేల మందికి పరీక్షలు నిర్వహించి, 1500 మంది బాధితులను గుర్తించినట్లు తెలిపారు. ఈనెల 23లోగా తొలి విడత పూర్తి చేసి, జనవరి 1 నుండి రెండో విడత శిబిరాలు ప్రారంభించాలని వైద్యులకు సూచించారు.
News December 20, 2025
కరీంనగర్: జూనియర్ లెక్చరర్ పోస్టుకు దరఖాస్తుల ఆహ్వానం

కరీంనగర్ బాలుర మైనారిటీ గురుకుల కళాశాలలో ఖాళీగా ఉన్న 1 గణితం జూనియర్ లెక్చరర్ పోస్టుకు ఔట్ సోర్సింగ్ విధానంలో దరఖాస్తులు కోరుతున్నట్లు జిల్లా మైనారిటి అధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. దీనికి మ్యాథ్స్ లో పీజీ చేసి 50 శాతం మార్కులుండి బీ.ఎడ్ చేసిన వారు అర్హులని, ధరఖాస్తులు ఈ నెల 29 వరకు కరీంనగర్ మైనారీటీ సంక్షేమ శాఖ కార్యాలయంలో అందజేయాలన్నారు. వివరాలకు 08782957085 లో సంప్రదించగలరు.


