News March 5, 2025

కరీంనగర్: నేడే పరీక్షలు.. ALL THE BEST

image

కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా 35,562 మంది విద్యార్థులు ఇంటర్ పరీక్షలు రాయనున్నారు. ఫస్టియర్ 17.799, సెకండియర్‌లో 17763 మంది విద్యార్థులు రాయనుండగా.. 58 పరీక్ష కేంద్రాలను ఏర్పాటుచేశారు. ఇంటర్ పరీక్షా కేంద్రాల పరిసర ప్రాంతాల్లో BNS 163(144) సెక్షన్ అమల్లో ఉంటుందని పోలీసులు తెలిపారు. ఒక నిమిషం ఆలస్యాన్ని తాజాగా 5 నిమిషాలకు సడలిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ALL THE BEST

Similar News

News November 17, 2025

KNR: NTR వీరాభిమాని గుండెపోటుతో మృతి

image

రాజకీయాల్లో చంద్రబాబు నాయడు కంటే సీనియర్, NTR వీరాభిమాని కళ్యాడపు ఆగయ్య గుండెపోటుతో KNRలో మృతి చెందారు. TDP ఆవిర్భావం నుంచి ఆగయ్య పార్టీని వీడకుండా పనిచేస్తూ ఎన్టీఆర్ వీరాభిమానిగా గుర్తింపు పొందారు. పేరు పెట్టి పిలిచేంతగా, ఎన్టీఆర్ కుటుంబంలో తెలిసిన వ్యక్తిగా ఆయనకు పేరుంది. కాగా, ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయన సేవలను గుర్తించి మహానాడు కార్యక్రమంలో ఆగయ్యను సన్మానించారు కూడా.

News November 17, 2025

WJI జిల్లా ప్రధాన కార్యదర్శిగా గుడాల శ్రీనివాస్

image

వర్కింగ్ జర్నలిస్ట్స్ ఆఫ్ ఇండియా(WJI) జిల్లా ప్రధాన కార్యదర్శిగా గన్నేరువరం మండల ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు, రిపోర్టర్ గుడాల శ్రీనివాస్ నియమితులయ్యారు. ఆదివారం జిల్లా కేంద్రంలో జరిగిన కార్యవర్గ సమావేశంలో రాష్ట్ర కమిటీ సూచనల మేరకు ఆయనను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ రాష్ట్ర నాయకత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూ, జర్నలిస్టుల సంక్షేమం, సంఘం బలోపేతం కోసం కృషి చేస్తానని పేర్కొన్నారు.

News November 17, 2025

జమ్మికుంటలో పత్తి కొనుగోళ్లు బంద్

image

CCI L- 1, L- 2 విధానాలు, స్లాట్ బుకింగ్ వల్ల రైతులు, జిన్నింగ్ మిల్లులు ఇబ్బందులు పడుతున్నాయని జమ్మికుంట మార్కెట్ కమిటీ తెలిపింది. వినతులు ఇచ్చినా చర్యలు లేకపోవడంతో జిన్నింగ్ మిల్లుల అసోసియేషన్ పిలుపుమేరకు నేటి నుంచి జమ్మికుంటలో CCI, ప్రైవేట్ కొనుగోళ్లు నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. రైతులు పత్తిని మార్కెట్‌ యార్డు, మిల్లులకు తీసుకురావద్దని, ‘కపాస్ కిసాన్’లో స్లాట్ బుక్ చేయవద్దని సూచించారు.