News October 8, 2024
కరీంనగర్: నేడే ‘సద్దుల బతుకమ్మ’

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సాధారణంగా తొమ్మది రోజులకు సద్దుల బతుకమ్మ నిర్వహిస్తారు. కానీ, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని వేములవాడ సహా.. పలు ప్రాంతాల్లో మాత్రం ఏడు రోజులకే సద్దుల బతుకమ్మ నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ సందర్భంగా ఇక్కడి ఇంటి బిడ్డలు, కోడళ్లు.. 7, 9 రోజులకు రెండు సార్లూ సద్దుల బతుకమ్మలో పాల్గొంటారు. మరి మీ ప్రాంతంలో సద్దుల బతుకమ్మ ఎప్పుడో కామెంట్ చేయండి.
Similar News
News October 17, 2025
KNR: ‘బంద్ ఫర్ జస్టిస్’కు ఏఐఎస్ఎఫ్ మద్దతు

‘బంద్ ఫర్ జస్టిస్’ తెలంగాణ బంద్కు తమ సంఘం సంపూర్ణ మద్దతు తెలుపుతుందని ఏఐఎస్ఎఫ్ (AISF) రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠ రెడ్డి కరీంనగర్లో ప్రకటించారు. బీసీ రిజర్వేషన్ల బిల్లు పట్ల బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే, వెంటనే గవర్నర్, రాష్ట్రపతి చేత ఆమోదింపజేసి 9వ షెడ్యూల్లో చేర్చాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ బంద్ ద్వారానైనా బీసీ బిల్లును కేంద్ర ప్రభుత్వం ఆమోదించాలని ఆయన కోరారు.
News October 17, 2025
కరీంనగర్లో స్వదేశీ ఉత్సవ్ మేళా

కరీంనగర్లోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో శుక్రవారం ‘స్వదేశీ ఉత్సవ్ – క్యాంపస్ ఎకో బజార్ ఫర్ స్వదేశీ దీపావళి ఫెరియా ఫెస్తా’ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శాతవాహన యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ యు.ఉమేష్ కుమార్ హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. కళాశాల ప్రిన్సిపల్ కె. రామకృష్ణ, ప్రిన్సిపాల్ వరలక్ష్మి, అధ్యాపకులు, విద్యార్థులు ఈ ఉత్సవంలో పాల్గొన్నారు.
News October 17, 2025
దళారులను నమ్మి మోసపోవద్దు: కవ్వంపల్లి

శంకరపట్నం మండలం తాడికల్, కేశవపట్నంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం లిమిటెడ్ తాడికల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను మానకొండూరు MLA కవ్వంపల్లి సత్యనారాయణ శుక్రవారం ఉదయం ప్రారంభించారు. ఈ సందర్భంగా MLA మాట్లాడుతూ.. రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని, కొనుగోలు కేంద్రాల్లోనే మద్దతు ధరకు ధాన్యం అమ్మాలని సూచించారు. జిల్లా వ్యాప్తంగా 325 కేంద్రాల్లో కొనుగోలు కొనసాగుతుందని తెలిపారు.