News March 4, 2025
కరీంనగర్: పట్టభద్రుల ఎన్నిక కౌంటింగ్ అప్డేట్

కరీంనగర్, నిజామాబాద్, మెదక్, ఆదిలాబాద్ పట్టభద్రుల ఎన్నికలో ఇప్పటివరకు 2 లక్షల 10 వేల ఓట్లను లెక్కించినట్లు అధికారులు ప్రకటించారు. ఇందులో సుమారు 21 వేల ఓట్లు చెల్లుబాటు కాలేదన్నారు. సుమారు ఒక లక్ష 89 వేల ఓట్లు చెల్లుబాటు అయ్యాయని ఇంకా 40 వేల ఓట్లు ప్రాథమిక లెక్కింపు విభజన చేయాల్సి ఉందన్నారు. మంగళవారంఉదయం 10 గంటల నుంచి ప్రాధాన్యత ఓట్లను కౌంటింగ్ చేయనున్నట్లు తెలిపారు.
Similar News
News February 8, 2026
తల్లీ బిడ్డలు మృతి.. కన్నీళ్లు తెప్పిస్తున్న సూసైడ్ లెటర్

పుత్తూరులో పద్మ ఇద్దరు పిల్లలతో <<19079819>>ఆత్మహత్య<<>> చేసుకున్న ఘటన తెలిసిందే. ‘సంపాదన లేని భర్తతో వేగలేక, కుటుంబాన్ని నెట్టుకురాలేక నేను ఇబ్బందులు పడ్డా. తల్లిదండ్రులను ఎదిరించి పెళ్లి చేసుకున్న ప్రతి అమ్మాయికి నా జీవితం ఒక గుణపాఠం. భార్యా పిల్లలను పోషించలేని వాడు పెళ్లెందుకు చేసుకోవాలి. మేము చనిపోతున్నాం. ఇక నువ్వు హ్యాపీగా ఉండు. అన్న నన్ను క్షమించి. 8ఏళ్లు అవుతుంది నీతో మాట్లాడి’అని ఆమె సూసైడ్ లేఖ రాసింది.
News February 8, 2026
అల్లూరి: ఆశా కార్యకర్తల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

అల్లూరి సీతారామరాజు, పోలవరం జిల్లాల పరిధిలోని ఖాళీగా ఉన్న ఆశా కార్యకర్తల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయిందని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా. కృష్ణమూర్తి తెలిపారు. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. అర్హులైన అభ్యర్థులు తమ దరఖాస్తులను శనివారం నుంచి ఫిబ్రవరి 20వ తేదీ లోగా సంబంధిత ఆస్పత్రి వైద్యునికి స్వయంగా అందజేయాలని సూచించారు. దరఖాస్తులు ఆన్లైన్లో అందుబాటులో ఉంచామని పేర్కొన్నారు.
News February 8, 2026
నేడు ఈ పనులు చేయకండి!

ఈరోజు భాను సప్తమి. ఆదిత్యుడిని పూజించే పవిత్రమైన రోజు! ఇంతటి శుభదినానికి గౌరవమిస్తూ కొన్ని నియమాలు పాటించడం మంచిది. ‘మద్యానికి దూరంగా ఉండాలి. మాంసం ముట్టరాదు. ఒంటికి, తలకు నూనె పెట్టుకోరాదు. ఉల్లి, వెల్లుల్లి తినరాదు. బ్రహ్మచర్యం పాటించాలి’ అని సూర్యాష్టకంలో ఉంది. లేకపోతే 7 జన్మల పాటు రోగాలు, దరిద్రంతో బాధ పడతారని పండితులు చెబుతున్నారు. శుభ ఫలితాలకై నేడు ఏం చేయాలో తెలుసుకోవడానికి క్లిక్ <<-se_10013>>భక్తి<<>>.


