News March 6, 2025
కరీంనగర్: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు.. ఎవరికి ఎన్ని ఓట్లంటే..?

ఉమ్మడి కరీంనగర్, మెదక్, అదిలాబాద్, నిజామాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి విజయం సాధించిన విషయం తెలిసిందే. రెండో ప్రాధాన్యత ఓట్లతో బీజేపీ నుంచి పోటీ చేసిన అంజిరెడ్డి 98,637 ఓట్లతో విజయం సాధించారు. కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన నరేందర్ రెడ్డికి 93,531 ఓట్లు వచ్చాయి. బీఎస్పీ నుంచి పోటీ చేసిన ప్రసన్న హరికృష్ణకు 63,972 ఓట్లు వచ్చినట్లు అధికారులు తెలిపారు.
Similar News
News December 16, 2025
BHPL: మూడో విడత ‘ఖరీదైన‘ పంచాయతీ ఎన్నికలు!

జిల్లాలో మూడో విడత 78 పంచాయతీలలో ఎన్నికలు జరుగుతున్నాయి. అభ్యర్థుల ఖర్చు తడిసి ముద్దవుతోంది. ఎన్నికల ప్రకటన వెలువడినప్పటి నుంచి ప్రారంభమైన ఖర్చు నామినేషన్ల తర్వాత ఖర్చు లక్షల్లోకి పెరిగింది. నాలుగు మండలాల్లో పోలింగ్ బుధవారం జరుగుతోంది. పంచాయతీల్లో డబ్బు మద్యం ఏరులై పారుతోంది. కాళేశ్వరం, కాటారం, మహాదేవపుర్, గంగారం, మహాముత్తారం, శంకరంపల్లి ఆదివారంపేట, సూరారం, ధన్వాడ గ్రామాలు ప్రతిష్ఠాత్మకంగా మారాయి.
News December 16, 2025
ములుగు: 2 నెలల క్రితమే జిల్లాలోకి దామోదర్ టీం!

మావోయిస్టు నేత బడే దామోదర్ను పోలీసులు పట్టుకున్న విషయం తెలిసిందే. అయితే రెండు నెలల క్రితమే దామోదర్తో పాటు ఆయన క్యాడర్ ములుగు జిల్లాకు చేరుకున్నట్లు తెలుస్తోంది. ఛత్తీస్గఢ్లో నిర్బంధం పెరగడం, ప్రస్తుతం తెలంగాణలో కాల్పుల విరమణ ఉండడడంతో సేఫ్ జోన్గా భావించినట్లు సమాచారం. కాగా, జిల్లాలో ఇటీవల ఎన్కౌంటర్ జరిగిన అటవీ ప్రాంతంలో షెల్టర్ తీసుకున్నట్లు చర్చ జరుగుతోంది.
News December 16, 2025
జగిత్యాల: మూడో విడత ఎన్నికలకు భారీ బందోబస్తు

జగిత్యాల జిల్లాలో మూడో విడత గ్రామపంచాయతీ ఎన్నికలను శాంతియుతంగా నిర్వహించేందుకు 853 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశామని ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. బుగ్గారం, ధర్మపురి, ఎండపల్లి, గొల్లపల్లి, పెగడపల్లి, వెల్గటూర్ మండలాల్లో 119 పంచాయతీలకు ఎన్నికలు జరుగనున్నాయి. పోలింగ్ కేంద్రాల వద్ద 200 మీటర్ల పరిధిలో 163 BNSS సెక్షన్ అమలులో ఉంటుందని పేర్కొన్నారు.


