News February 28, 2025

కరీంనగర్: పట్టభద్రుల పోలింగ్ 70.42% టీచర్స్ పోలింగ్ 91.90%

image

పట్టభద్రుల, టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల ఫైనల్ పోలింగ్ శాతాన్ని ఎన్నికల అధికారులు ప్రకటించారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటింగ్ 70.42 శాతం అయినట్లు పేర్కొన్నారు. అలాగే ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ 91.90 శాతం నమోదైనట్లు వెల్లడించారు. జిల్లాలో ఎన్నికలు ప్రశాంతంగా ముగిసినట్లు తెలిపారు.

Similar News

News November 24, 2025

కామారెడ్డి జిల్లాలో నలుగురు ఎస్ఐల బదిలీ

image

పరిపాలనా కారణాల దృష్ట్యా కామారెడ్డి జిల్లాలోని నలుగురు SIలను వేరే పోలీస్ స్టేషన్‌లకు అటాచ్ చేస్తూ కామారెడ్డి జిల్లా ఎస్పీ కార్యాలయం సోమవారం మెమోరాండం జారీ చేసింది. కె.విజయ్‌ను మద్నూర్ నుంచి బిబిపేట్‌కు, ఎం.ప్రభాకర్‌ను బిబిపేట్ నుంచి దోమకొండకు, డి.స్రవంతిని దోమకొండ నుంచి కామారెడ్డి టౌన్‌కు జి.రాజును (వెయిటింగ్ రిజర్వ్) నుంచి మద్నూర్ పీఎస్‌కు అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.

News November 24, 2025

ADB అధికారులతో డిప్యూటీ సీఎం వీడియో కాన్ఫరెన్స్

image

ఇందిరా మహిళ శక్తి చీరల పంపిణీని రేపట్లోగా పూర్తి చేయాలని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. సోమవారం ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి, ఉన్నతాధికారులతో కలిసి ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మున్సిపాలిటీ పరిధిలో నిర్మితమైన 982 రెండు పడకగదుల ఇళ్ల నిర్మాణం పూర్తయిందని ఆదిలాబాద్ అదనపు కలెక్టర్ శ్యామలాదేవి తెలిపారు. దీనిపై స్పందించిన ఉపముఖ్యమంత్రి అర్హులైన లబ్ధిదారులకు అందజేయాలన్నారు.

News November 24, 2025

రేపు కామారెడ్డి జిల్లాకి టీజీఎంబీసీడీసీ అధికారుల రాక

image

రేపు జిల్లాకి తెలంగాణ మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (TGMBCDC) రాష్ట్ర అధికారులు రాబోతున్నట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. సోమవారం అయన మాట్లాడుతూ.. జిల్లాలోని MBC కులాల సామాజిక ఆర్థిక స్థితి మీద వారు సర్వే నిర్వహిస్తారన్నారు. వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి అధ్యక్షతన రేపు కలెక్టర్ కార్యాలయంలోని రూమ్ నెంబర్ 226లో ఉదయం 11 గంటలకు సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.