News February 28, 2025
కరీంనగర్: పట్టభద్రుల పోలింగ్ 70.42% టీచర్స్ పోలింగ్ 91.90%

పట్టభద్రుల, టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల ఫైనల్ పోలింగ్ శాతాన్ని ఎన్నికల అధికారులు ప్రకటించారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటింగ్ 70.42 శాతం అయినట్లు పేర్కొన్నారు. అలాగే ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ 91.90 శాతం నమోదైనట్లు వెల్లడించారు. జిల్లాలో ఎన్నికలు ప్రశాంతంగా ముగిసినట్లు తెలిపారు.
Similar News
News November 17, 2025
హిందువులపై దాడులు బాధాకరం: షేక్ హసీనా

బంగ్లాదేశ్లో యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం మైనార్టీలు, ముఖ్యంగా హిందువులపై దాడులను ప్రోత్సహిస్తోందని మాజీ PM షేక్ హసీనా మండిపడ్డారు. దీంతో వారంతా పారిపోవాల్సి వస్తోందన్నారు. దేశంలో హింస పెరిగిపోయిందని, ప్రజాస్వామ్యం, లౌకిక నిర్మాణం క్షీణిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. యువత ఆందోళనలతో హసీనా గతేడాది ఆగస్టు 5 నుంచి భారత్లో ఆశ్రయం పొందుతోన్న విషయం తెలిసిందే.
News November 17, 2025
MBNR: యువకుడి దారుణ హత్య.. నలుగురి అరెస్ట్

తమ్ముడి వివాహానికి సహకరించిన అన్నను <<18301281>>హత్య<<>> చేసిన ఘటన మహబూబ్ నగర్ జిల్లాలో కలకలం రేపిన విషయం తెలిసిందే. పోలీసులు సోమవారం నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు. గ్రామంలో కుటుంబీకులు అంత్యక్రియలు నిర్వహించనుండగా పోలీసులు భారీగా మోహరించారు. యువతి తండ్రి నుంచి తనకు ప్రాణహాని ఉందని రాజశేఖర్ తమ్ముడు చంద్రశేఖర్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
News November 17, 2025
MANITలో ఉద్యోగాలు.. అప్లై చేశారా?

మౌలానా అజాద్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(MANIT)లో 15 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. అర్హతగల అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు హార్డ్ కాపీని ఈ నెల 27వరకు స్పీడ్ పోస్ట్ ద్వారా పంపాలి. ME, M.Tech, M.Arch, మాస్టర్ ఆఫ్ డిజైన్తో పాటు సంబంధిత విభాగంలో PhD పూర్తి చేసి ఉండాలి. దరఖాస్తు ఫీజు రూ.1500. వెబ్సైట్: https://www.manit.ac.in


