News March 24, 2025
కరీంనగర్: ప్రజావాణిలో సాంకేతిక సమస్య.. ఇబ్బంది పడ్డ అర్జీదారులు

కరీంనగర్ కలెక్టర్ ప్రజావాణిలో సర్వర్ సమస్య తలెత్తడంతో అర్జీదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. తమ సమస్యలను విన్నవించేందుకు కలెక్టరేట్కు వచ్చారు. అయితే, సర్వర్లో సాంకేతిక సమస్య వల్ల కాస్త ఆలస్యం అయింది. అర్జీదారులు అధికారులపై అగ్రహం వ్యక్తం చేశారు. ఓవైపు ఎండ వేడిమి ఉండడతో కనీసం నీళ్ల సౌకర్యాలు కూడా కల్పించలేదని వాపోయారు. చివరకు సర్వర్ ప్రాబ్లం క్లియర్ అవడంతో అధికారులు అర్జీలు స్వీకరించారు.
Similar News
News November 27, 2025
రామడుగు: నామినేషన్ల స్వీకరణ కేంద్రాలను సందర్శించిన కలెక్టర్

రామడుగు మండలం వెదిర గ్రామ పంచాయతీ కార్యాలయంలో వెదిర, వెలిచాల గ్రామాల పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఏర్పాటు చేసిన నామినేషన్ల స్వీకరణ కేంద్రాన్ని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ పమేలా సత్పతి సందర్శించారు. తొలి విడతలో కరీంనగర్ రెవెన్యూ డివిజన్ పరిధిలోని గంగాధర, రామడుగు, చొప్పదండి, కొత్తపల్లి, కరీంనగర్ రూరల్ మండలాల్లోని 92 సర్పంచ్, 866 వార్డు మెంబర్ల స్థానాలకు గురువారం నోటిఫికేషన్ విడుదల చేశారు.
News November 27, 2025
కరీంనగర్కు వచ్చిన పంచాయతీ ఎన్నికల జిల్లా పరిశీలకులు

పంచాయతీ ఎన్నికల జిల్లా పరిశీలకులు, HACA మేనేజింగ్ డైరెక్టర్ కె.చంద్రశేఖర్ రెడ్డి గురువారం కరీంనగర్ కు వచ్చారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకాడే కలిసి ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం రోడ్లు, భవనాల శాఖ అతిథి గృహంలో సమావేశమయ్యారు. జిల్లాలో పంచాయతీ ఎన్నికల నిర్వహణ, పోలింగ్ కేంద్రాలు, ఓటర్ల సంఖ్య, ఎన్నికలకు ఏర్పాట్లు తదితర అంశాలపై చర్చించారు.
News November 26, 2025
KNR: జిల్లా మ్యూజియం అభివృద్ధిపై కలెక్టర్ సమీక్ష

కలెక్టర్ పమేలా సత్పతి బుధవారం జిల్లా మ్యూజియంను సందర్శించి, అన్ని విభాగాలను పరిశీలించారు. మ్యూజియం అభివృద్ధి, సందర్శకులకు మెరుగైన సౌకర్యాలు, కొత్త ప్రదర్శనల ఏర్పాటు వంటి అంశాలపై అధికారుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. మ్యూజియం ఆధునికీకరణకు అవసరమైన చర్యలను త్వరగా చేపట్టాలని ఆమె సూచించారు. కలెక్టర్ వెంట మున్సిపల్ కమిషనర్ ప్రపుల్ దేశాయ్ కూడా ఉన్నారు.


