News March 29, 2025
కరీంనగర్: ప్రమాదవశాత్తు చెరువులో పడి బాలిక మృతి

కరీంనగర్ నగర పాలక పరిధిలోని రేకుర్తి సింహాద్రి కాలనీలో ప్రమాదవశాత్తు చెరువులో పడి శ్రీనిధి అనే బాలిక మృతి చెందింది. పెంపుడు కుక్కను బయటికి తీసుకువెళ్లగా.. ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీ రూమ్కు తరలించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News February 23, 2026
రేపు కుమ్మెరకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి రాక

నాగర్ కర్నూల్ జిల్లా తాడూరు మండలం కుమ్మెర గ్రామానికి రేపు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు రానున్నారు. ఇటీవల కులవివక్షకు గురైన బాధితులను ఆయన పరామర్శిస్తారని పార్టీ నాయకులు తెలిపారు. అనంతరం అక్కడే ఏర్పాటు చేసే విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడనున్నారు.
News February 23, 2026
ఫౌండేషన్ రాసుకుంటే ఇలా అవుతోందా?

మేకప్లో ముఖ్యమైన పార్ట్ ఫౌండేషన్. దీని ఎంపికలో కొన్ని పొరపాట్లు చేయడం వల్ల ముఖం డల్గా మారుతుంది. ఇలా కాకుండా ఉండటానికి కొన్ని టిప్స్.. సరైన షేడ్ ఎంచుకోవాలి. మీ షేడ్ కన్నా లైటర్ షేడ్ ఎంచుకుంటే ఫ్లేకీగా కనిపిస్తుంది. స్కిన్ కేర్, ఫౌండేషన్ సేమ్ బేస్డ్వి తీసుకోవాలి. కొన్ని ఫౌండేషన్స్ స్కిన్ ఆయిల్స్తో కలిసి టైమ్ గడిచేకొద్దీ ఆక్సిడేషన్ చెందుతాయి. కాబట్టి లాంగ్ లాస్టింగ్ ఫౌండేషన్ ఎంచుకోవాలి.
News February 23, 2026
వేసవిలో నిరంతర విద్యుత్ సరఫరాకు పూర్తి సన్నాహాలు: ఎస్ఈ గంగాధర్

NPDCL పరిధిలో విద్యుత్ డిమాండ్ 5,904 మెగావాట్లకు చేరిందని PDPL సర్కిల్ ఎస్ఈ గంగాధర్ తెలిపారు. వేసవిలో పీక్ లోడ్ను ఎదుర్కొనేందుకు 126 కొత్త డీటీల ఏర్పాటు, 12 పవర్ ట్రాన్స్ఫార్మర్లు, 11 సబ్స్టేషన్లు నిర్మాణం చేపట్టినట్లు వెల్లడించారు. 26 బ్రేకర్లు, 15 ఇంటర్లింకింగ్ లైన్లు ఏర్పాటు చేసి సరఫరా నాణ్యత మెరుగుపరిచామని, అంతరాయం లేకుండా విద్యుత్ అందించేందుకు సన్నాహాలు పూర్తిచేసినట్లు స్పష్టం చేశారు.


