News March 3, 2025

కరీంనగర్: ప్రారంభమైన టీచర్స్ ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు

image

కరీంనగర్‌లోని అంబేడ్కర్ ఇండోర్ స్టేడియంలో ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, కరీంనగర్, టీచర్స్ ఎమ్మెల్సీ ప్రాథమిక ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది. మొదట చెల్లని ఓట్లు, చెల్లిన ఓట్ల విభజన చేశారు. ప్రస్తుతం టీచర్ల ఓట్ల కట్టలను టేబుల్స్ పైకి తీసుకొచ్చారు. మరి కొద్దిక్షణాల్లోనే టీచర్ల ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొదలుకానుంది. ఓట్ల కౌంటింగ్ కోసం అధికారులు14 టేబుల్స్ ఏర్పాటు చేశారు.

Similar News

News October 17, 2025

వరంగల్ తూర్పులో రెండుగా చీలిన నేతలు?

image

వరంగల్ తూర్పు నియోజకవర్గంలో అధికార పార్టీ నేతలు రెండు వర్గాలుగా చీలిపోయారు. మంత్రి కొండా సురేఖ ప్రాతినిధ్యం వహించే నియోజకవర్గంలో డీసీసీ అధ్యక్షుడి ఎన్నిక కోసం జరిగిన సమావేశాలు ఇందుకు వేదికైంది. ఏఐసీసీ పరిశీలకుడు నవజ్యోత్ పట్నాయక్ సాక్షిగా రెండు వర్గాల సమావేశాలు రెండు ప్రాంతాల్లో జరిగింది. మంత్రి సురేఖ పదవి పోవడం ఖాయమంటూ తూర్పులో నేతలంతా మరో నేత బస్వరాజు సారయ్య దగ్గర క్యూ కట్టినట్టు తెలుస్తోంది.

News October 17, 2025

విశాఖలో పెట్టుబడికి మరో సంస్థ ఆసక్తి

image

AP: నిర్మాణ సంస్థ కె.రహెజా విశాఖలో పెట్టుబడులకు ముందుకొచ్చింది. IT సంస్థలకు అవసరమైన వాణిజ్య, నివాస భవనాలు నిర్మించేందుకు ఆసక్తి చూపుతోంది. రూ.2,172కోట్ల మేర పెట్టుబడులు పెట్టనున్నామని, మధురవాడలో 27 ఎకరాల భూమి కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరింది. ఈ ప్రాజెక్ట్ ద్వారా 9,681మందికి ఉపాధి లభిస్తుందని పేర్కొంది. ఇటీవల విశాఖలో డేటా సెంటర్ ఏర్పాటుకు గూగుల్‌తో ప్రభుత్వం ఒప్పందం చేసుకున్న విషయం తెలిసిందే.

News October 17, 2025

విశాఖ సెంట్రల్ జైలుకు ఎచ్చెర్ల MPP

image

ఎచ్చెర్ల MPP చిరంజీవిని బుధవారం రాత్రి పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అతనిపై రెండేళ్లుగా 14 కేసులు నమోదయ్యాయని, అతను చెడు వ్యవసనాలతో ప్రజల పట్ల దురుసుగా ప్రవర్తిస్తుండడంతో అరెస్ట్ చేసినట్లు జిల్లా SP కేవీ మహేశ్వరరెడ్డి తెలిపారు. అతనిపై PD యాక్ట్ నమోదు చేయాలని ఎచ్చెర్ల పోలీసులు జిల్లా కార్యాలయానికి ప్రతిపాదనలు పంపించినట్లు తెలిపారు. నిందితుడిని విశాఖ సెంట్రల్ జైలుకు తరలించినట్లు తెలిపారు.