News March 3, 2025
కరీంనగర్: ప్రారంభమైన టీచర్స్ ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు

కరీంనగర్లోని అంబేడ్కర్ ఇండోర్ స్టేడియంలో ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, కరీంనగర్, టీచర్స్ ఎమ్మెల్సీ ప్రాథమిక ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది. మొదట చెల్లని ఓట్లు, చెల్లిన ఓట్ల విభజన చేశారు. ప్రస్తుతం టీచర్ల ఓట్ల కట్టలను టేబుల్స్ పైకి తీసుకొచ్చారు. మరి కొద్దిక్షణాల్లోనే టీచర్ల ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొదలుకానుంది. ఓట్ల కౌంటింగ్ కోసం అధికారులు14 టేబుల్స్ ఏర్పాటు చేశారు.
Similar News
News March 20, 2025
బడ్జెట్లో ములుగు జిల్లా ప్రజలకు నిరాశే!

తెలంగాణ ప్రభుత్వం బుధవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ ములుగు జిల్లా ప్రజలకు నిరాశే మిగిల్చింది. జిల్లాలో ప్రపంచంలోనే అతిపెద్ద ఆదివాసీ జాతరైన మేడారం అభివృద్ధికి నిధులు కేటాయించలేదు. కొత్తగా మున్సిపాలిటీగా అవతరించిన ములుగు పట్టణ అభివృద్ధి యాక్షన్ ప్లాన్కు బడ్జెట్లో చోటు దక్కలేదు. జిల్లాలోని యువత ఎంతగానో ఎదురు చూస్తున్న ఉపాధి పరిశ్రమల ఏర్పాటుకు నిధులు కేటాయించకపోవడం యువత నిరాశకు లోనయ్యారు.
News March 20, 2025
పన్ను వసూళ్ళలో హుజూరాబాద్కు మొదటిస్థానం

ఇంటిపన్ను వసూళ్లలో హుజూరాబాద్ మున్సిపాలిటీ 100 శాతం లక్ష్యాన్ని సాధించి రాష్ట్రంలోనే మొదటిస్థానంలో నిలిచిందని మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య తెలిపారు. కమీషనర్ మాట్లాడుతూ.. ఈ ఘనత ప్రజల సహకారంతోనే సాధ్యమైందన్నారు. అధికార్లు, సిబ్బంది ముందు కార్యాచరణ రూపొందించి సమర్థవంతంగా పని చేయటం వల్ల ఈ విజయం సాధించామన్నారు. హుజూరాబాద్ మున్సిపల్ పౌరులకు మెరుగైన సేవలు అందించడానికి కృషి చేస్తామన్నారు.
News March 20, 2025
నిర్మల్: ‘మున్సిపాలిటీల నిధులను సమర్థవంతంగా వాడాలి’

పట్టణాల అభివృద్ధికి కేటాయించిన నిధులను సమర్థవంతంగా వినియోగించాలని కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. మున్సిపాలిటీల్లో వివిధ అభివృద్ధి పనులకు మంజూరైనా నిధులను పారదర్శకంగా వినియోగించాలని సూచించారు. మున్సిపాలిటీల వారీగా కేటాయించిన నిధులు, చేపట్టిన పనులు, ఖర్చు చేసిన, అందుబాటులో ఉన్న నిధులకు సంబంధించిన వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.