News January 11, 2025
కరీంనగర్: ఫుడ్ పాయిజన్.. అధికారుల SUSPEND
కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మహాత్మా నగర్ ఇంటిగ్రేటెడ్ హాస్టల్లో ఇటీవల విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ అయిన విషయం తెలిసిందే. కాగా, ఈ ఘటనలో హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ వి.రేవను కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఫుడ్ పాయిజన్ ఘటనపై సమాచారం ఇవ్వకుండా విద్యార్థినుల పట్ల నిర్లక్ష్యం వహించినందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
Similar News
News January 13, 2025
ఒకే వేదికపై కరీంనగర్ పార్లమెంటు సభ్యులు
నిన్న జరిగిన ఉనిక పుస్తక ఆవిష్కరణలో కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు ఒకే వేదికను పంచుకున్నారు. అయితే ఈ వేదికపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. కరీంనగర్ ఎంపీగా విద్యాసాగర్ రావును నేను ఓడిస్తే.. నన్ను వినోద్ కుమార్ ఓడించాడు. మా ఇద్దరినీ బండి సంజయ్ ఓడించాడని అన్నారు. దీంతో సభలో ఒక్కసారిగా నవ్వులు పూశాయి. ఏది ఏమైనా కరీంనగర్ జిల్లాకు వన్నె తెచ్చిన మహనీయుడు విద్యాసాగర్ రావు అన్నారు.
News January 13, 2025
KNR: పిల్లలపై భోగి పండ్లు ఎందుకు పోస్తారో తెలుసా!
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో పిల్లలపై భోగి పండ్లు పోస్తారు. వీటిని ఎందుకు పోస్తారో తెలుసా..? రేగు పండ్లనే భోగి పండ్లుగా పిలుస్తారు. వీటికి అర్కఫలం అనే పేరు ఉంది. అర్కుడు అంటే సూర్యుడు అని అర్థం. సూర్యుడు ఉత్తరాయణం వైపు మళ్లే సమయం కాబట్టి ఆయన కరుణాకటాక్షాలు పిల్లలపై ఉండాలనే ఉద్దేశంతో పోస్తారు. వీటిని ఐదేళ్ల లోపు పిల్లల తలపై పోస్తే ఆయురారోగ్యాలతో ఉంటారని నమ్మకం.
News January 13, 2025
జనవరి 26 నుంచి రైతు భరోసా పథకం ప్రారంభం: పెద్దపల్లి ఎమ్మెల్యే
ఈనెల 26 నుంచి రైతు భరోసా పథకం ప్రారంభమవుతుందని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణా రావు తెలిపారు. భరోసా, ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డుల ప్రక్రియపై ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని సమీక్ష సమావేశంలో ఆయన పాల్గొన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు, ప్రభుత్వ విప్లు, తదితర ఎమ్మెల్యేలు, అధికారులు పాల్గొన్నారు.