News March 2, 2025
కరీంనగర్: భద్రతా నియమాలు పాటించాలి

ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు రేపు జరగనున్న విషయం తెలిసిందే. దీంతో లెక్కింపునకు వచ్చే కౌంటింగ్ ఏజెంట్లు, క్లరికల్ సిబ్బంది, పాత్రికేయులు భద్రతా నియమాలు పాటించాలని ట్రాఫిక్ ఏసిపి యాదగిరిస్వామి ఓ ప్రకటనలో తెలిపారు. అంబేద్కర్ స్టేడియం గేట్ నంబర్-1 ద్వారా మాత్రమే లోపలికి ప్రవేశించి నిర్దేశించబడిన ప్రదేశంలో వాహనాలను పార్కింగ్ చేసుకుని, గేట్ నంబర్ -4 ద్వారా ఇండోర్ స్టేడియంలోకి అనుమతించనున్నట్లు పేర్కొన్నారు.
Similar News
News November 25, 2025
ఉద్యాన పంటలతోనే సీమ అభివృద్ధి: పయ్యావుల

AP: రాయలసీమలో రైతుల ఆదాయం పెరగాలంటే అది ఉద్యాన పంటలతోనే సాధ్యమని మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. సీమలో పారిశ్రామిక అభివృద్ధితో పాటు హార్టికల్చర్ సాగు విస్తీర్ణం పెరగాలని, అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని స్థానిక అధికారులకు సూచించారు. సీమలో సంపద సృష్టి, సిరి సంపదల వృద్ధి ఉద్యాన పంటలతో సాధ్యమవుతుందని, ప్రభుత్వ పథకాలను రైతులు సద్వినియోగం చేసుకుంటూ హార్టికల్చర్పై దృష్టి పెట్టాలన్నారు.
News November 25, 2025
కామారెడ్డి: రోడ్డు ప్రమాదంలో నవ వధువు మృతి

సిద్దిపేట జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో KMR(D)కు చెందిన నవవధువు మృతి చెందింది. పోలీసుల వివరాల ప్రకారం..బిచ్కుందకు చెందిన సాయికిరణ్కు 4 నెలల క్రితం SDPTకు చెందిన ప్రణతితో పెళ్లైంది. వీరిద్దరూ HYDలో ఉద్యోగం చేస్తున్నారు. SDPTలో ఓ ఫంక్షన్కు హజరైన దంపతులు నిన్న బైకుపై HYD వెళ్తుండగా పెద్దచెప్యాల వద్ద ట్రాక్టర్ వెనక నుంచి వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ప్రణతి మృతి చెందగా, సాయికిరణ్ గాయపడ్డాడు.
News November 25, 2025
సూర్యాపేట: నామినేషన్ వేస్తే ఏకగ్రీవమే!

త్వరలో జరగనున్న పంచాయతీ ఎన్నికల్లో నూతనకల్ మండలం పెదనెమిల జీపీలో ఓ విచిత్ర పరిస్థితి నెలకొంది. పెదనెమిల జీపీలోని 1వ వార్డు ఎస్టీ జనరల్కు రిజర్వ్ అయింది. అయితే గ్రామంలో ఎస్టీ వర్గానికి చెందిన ఓటరు ఒక్కరే ఉండటం విశేషం. నామినేషన్ వేసే ప్రక్రియ పూర్తయితే, వార్డు మెంబర్ ఏకగ్రీవం కానుంది.


