News September 9, 2024
కరీంనగర్: భారీగా పెరుగుతున్న నిత్యావసర సరకుల ధరలు!

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కూరగాయలు, వంట నూనెలు, నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. పది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఇతర రాష్ట్రాల నుంచి సరఫరా తగ్గిపోయింది. దీంతో ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. పది రోజుల్లోనే వెల్లుల్లి కిలో ధర రూ.200 ఉండగా ప్రస్తుతం రూ.400 వరకు ఉంది. అటు ఉల్లి ధర కిలో రూ.30 ఉండగా, ప్రస్తుతం రూ.50 నుంచి రూ.60 దాకా పలుకుతోంది.
Similar News
News December 2, 2025
KNR: బహిరంగ మద్యపానంపై నిషేధం పొడిగింపు

కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ప్రజల భద్రత, శాంతిభద్రతలను దృష్టిలో ఉంచుకుని డ్రోన్ల వినియోగం, భారీ డీజే సౌండ్, బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడంపై నిషేధాజ్ఞలను ఈనెల 31 వరకు పొడిగిస్తున్నట్లు సీపీ గౌష్ ఆలం తెలిపారు. భద్రతాపరమైన అంశాలు, శబ్ద కాలుష్యం, మహిళల రక్షణ దృష్ట్యా ఈ చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.
News December 2, 2025
KNR: ఎన్నికల బందోబస్తుపై సీపీ గౌష్ ఆలం సమీక్ష

గ్రామ పంచాయతీ ఎన్నికలు శాంతియుతంగా జరిగేందుకు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేయాలని కరీంనగర్ సీపీ గౌష్ ఆలం అధికారులను ఆదేశించారు. సీపీ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. సమస్యాత్మక కేంద్రాలపై దృష్టి సారించాలని, ఓటర్లు నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకునేలా చూడాలని సూచించారు. రూట్ మొబైల్ బృందాలు నిరంతరం పర్యవేక్షించాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.
News December 2, 2025
సైబర్ నేరాలకు ‘ఫుల్స్టాప్’.. అవగాహనతోనే పరిష్కారం

మారుతున్న సాంకేతిక యుగంలో సైబర్ నేరాలపై ప్రజలకు పూర్తిస్థాయి అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని కరీంనగర్ సీపీ గౌష్ ఆలం అన్నారు. సైబర్ క్రైమ్ ఠాణాలో ‘ఫ్రాడ్ కా ఫుల్స్టాప్ – సైబర్ క్లబ్’ శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించి, పోస్టర్ రిలీజ్ చేశారు. విద్యార్థులు, ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ క్యాడెట్లు ముందుకు వచ్చి సైబర్ సేఫ్టీ అంబాసిడర్లుగా ఎదగాలని సీపీ పిలుపునిచ్చారు.


