News August 21, 2024

కరీంనగర్: మళ్లీ IASకే కమిషనర్ బాధ్యతలు!

image

కరీంనగర్ <<13902837>>కార్పొరేషన్‌ కొత్త కమిషనర్‌<<>>గా చాహత్‌ బాజ్‌పాయ్‌‌ని నియమిస్తూ CS శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేసిన విషయం విదితమే. 2019 IAS బ్యాచ్‌కు చెందిన చాహత్‌ బాజ్‌పాయ్‌ IIT కాన్పూరులో బీటెక్ పూర్తి చేశారు. ఈమె APతోపాటు తెలంగాణ రాష్ట్రంలో ITDA ప్రాజెక్టు డైరెక్టర్‌గా, సబ్‌ కలెక్టర్‌గా, అదనపు కలెక్టర్‌గా పని చేశారు. కాగా రెండేళ్ల తర్వాత మళ్లీ IASకే కరీంనగర్ కార్పొరేషన్ కమిషనర్ బాధ్యతలు అప్పగించారు.

Similar News

News November 25, 2025

HZB: పేదలకు మెరుగైన వైద్యం అందజేయాలి: బండి

image

కరీంనగర్ ఎంపీ, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ సోమవారం హుజూరాబాద్ ఏరియా ఆసుపత్రిని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతితో కలిసి సందర్శించారు. సుమారు కోటిన్నర రూపాయల విలువైన ఆధునిక వైద్య పరికరాలను ఆయన ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆసుపత్రి వైద్యులకు సూచించారు. ఈ కార్యక్రమంలో వైద్యులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

News November 25, 2025

KNR: భవన నిర్మాణ కార్మికులకు అవగాహన సదస్సులు

image

భవన నిర్మాణ కార్మికులకు ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై పది రోజుల పాటు అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నట్లు ఉప కార్మిక కమిషనర్ తెలిపారు. లేబర్ కమిషనర్ హైదరాబాద్ ఆదేశాల మేరకు డిసెంబర్ 3 వరకు ఈ సదస్సులు జరుగుతాయి. ప్రమాద బీమా, సహజ మరణం, పెళ్లి కానుక, ప్రసూతి లబ్ధి వంటి అంశాలపై నిర్వహించే ఈ సదస్సులను కార్మికులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

News November 24, 2025

KNR: ‘ప్రజావాణి’ దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలి

image

ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి త్వరగా పరిష్కరించాలని అదనపు కలెక్టర్ లక్ష్మీకిరణ్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజావాణిలో కరీంనగర్ నగరపాలక కమిషనర్ ప్రపుల్ దేశాయ్, ఆర్డీఓ మహేశ్వర్, ఇతర అధికారులతో కలిసి ఆయన ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా మొత్తం 352 దరఖాస్తులు వచ్చాయి. కొన్ని సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించారు.