News February 16, 2025

కరీంనగర్: మహాశివరాత్రికి ప్రత్యేక బస్సులు

image

మహా శివరాత్రి పురస్కరించుకొని వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి పుణ్య క్షేత్రానికి KNR, ఆదిలాబాద్, WGL, NZB రీజియన్లలోని వివిధ డిపోల నుంచి ఈ నెల 25 నుంచి 27 వరకు 778 అదనపు బస్సులు నడుపుతున్నామని KNR RM బి.రాజు ఒక ప్రకటనలో తెలిపారు. వేములవాడతో పాటు ఉమ్మడి KNR జిల్లాలోని వివిధ శైవ క్షేత్రాలకు, భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం శైవ క్షేత్రానికి కూడా అదనపు బస్సులు నడుపుతున్నామని పేర్కొన్నారు.

Similar News

News March 12, 2025

త్వరలో పరుగులు పెట్టనున్న హైడ్రోజన్ రైలు

image

దేశంలో త్వరలో హైడ్రోజన్‌తో నడిచే రైలు అందుబాటులోకి రానుంది. హరియాణా జింద్ నుంచి సోనిపట్ మార్గంలో నడిచే ఈ ట్రైన్‌ను ఈ నెల 31న ప్రారంభించే అవకాశాలున్నాయి. గంటకు 140కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే దీని వాటర్ సామర్థ్యం 40వేల లీటర్లు. ఒకసారి ఫుల్ చేస్తే 1000కిలోమీటర్లు ప్రయాణించగలదు. దేశవ్యాప్తంగా 35రైళ్లను అందుబాటులోకి తేవాలని రైల్వేశాఖ భావిస్తోంది. రీసెర్చ్, డిజైన్, స్టాండర్డ్ సంస్థ తయారు చేసింది.

News March 12, 2025

మెదక్: పనులు సక్రమంగా జరిగేలా చూడాలి: కలెక్టర్

image

రిజిస్ట్రేషన్‌, ధరణి ప్రక్రియ సక్రమంగా జరిగేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులు ఆదేశించారు. కౌడిపల్లి మండలం తహసీల్దార్‌ కార్యాలయాన్ని కలెక్టర్‌ రాహుల్ రాజ్ బుధవారం సందర్శించారు. భద్రపరిచిన రికార్డులు, వీడియో కాన్ఫరెన్స్‌, రిజిస్ట్రేషన్‌ గదులను పరిశీలించారు. రికార్డులను జాగ్రత్తగా భద్రపరచాలని, ధరణి పనితీరును పరిశీలించారు. సర్వర్‌ ఎలా పనిచేస్తుందని సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.

News March 12, 2025

శ్రీకాకుళం: ఏసీబీకి చిక్కిన బీసీ వెల్ఫేర్ సీనియర్ అసిస్టెంట్

image

శ్రీకాకుళం జిల్లా బీసీ వెల్ఫేర్ ఆఫీసుకు చెందిన Sr.అసిస్టెంట్ బుడుమూరు బాలరాజు లంచం తీసుకుంటూ బుధవారం ఏసీబీకి చిక్కారు. ఇంక్రిమెంట్ల, ఎంట్రీ, బిల్లుల ప్రాసెస్ చేసే విషయంలో అదే శాఖకు చెందిన వివిధ B.C హాస్టల్‌లో పనిచేస్తే అటెండర్, కుక్‌ల నుంచి రూ.25,000 లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు.

error: Content is protected !!