News February 16, 2025

కరీంనగర్: మహాశివరాత్రికి ప్రత్యేక బస్సులు

image

మహా శివరాత్రి పురస్కరించుకొని వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి పుణ్య క్షేత్రానికి KNR, ఆదిలాబాద్, WGL, NZB రీజియన్లలోని వివిధ డిపోల నుంచి ఈ నెల 25 నుంచి 27 వరకు 778 అదనపు బస్సులు నడుపుతున్నామని KNR RM బి.రాజు ఒక ప్రకటనలో తెలిపారు. వేములవాడతో పాటు ఉమ్మడి KNR జిల్లాలోని వివిధ శైవ క్షేత్రాలకు, భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం శైవ క్షేత్రానికి కూడా అదనపు బస్సులు నడుపుతున్నామని పేర్కొన్నారు.

Similar News

News December 15, 2025

విమాన ప్రయాణ ఛార్జీలను కట్టడి చేస్తాం: రామ్మోహన్ నాయుడు

image

విమాన ప్రయాణ ఛార్జీలను ఇష్టానుసారం వసూలు చేయకుండా కట్టడి చేస్తామని పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. ‘టారిఫ్ మానిటరింగ్ వ్యవస్థను మరింత పటిష్ఠం చేస్తాం. విమాన టికెట్‌ రేట్లు ఎక్కువగా ఉన్నట్లు ప్రయాణికులు గమనిస్తే వాటి స్క్రీన్ షాట్లను మాకు పంపించొచ్చు’ అని వివరించారు. డొమెస్టిక్ మార్గాల్లోనే కాకుండా అంతర్జాతీయ రూట్ల ఛార్జీలనూ మానిటర్ చేస్తామని పార్లమెంటులో ప్రకటించారు.

News December 15, 2025

చిన్నారుల్లో ఊబకాయాన్ని ముందే గుర్తించొచ్చు

image

ప్రస్తుతం చిన్నారుల్లోనూ ఊబకాయం ముప్పు పెరుగుతోంది. దీన్ని ముందే గుర్తించేందుకు సైంటిస్టులు పాలీజెనిక్‌ రిస్క్‌ స్కోర్‌ టెస్ట్‌ని క్రియేట్‌ చేశారు. దీనికోసం 50లక్షలకు పైగా జెనెటిక్‌ డేటాలను పరిశీలించారు. 5ఏళ్లలోపు పిల్లలకు పరీక్ష చేసి వచ్చిన స్కోర్‌‌తో ఫ్యూచర్‌లో ఒబెసిటీ వచ్చే ప్రమాదాన్ని గుర్తించొచ్చని నిపుణులు చెబుతున్నారు. దీంతో పిల్లల జీవనశైలిలో మార్పులు చేసి ఒబెసిటీ బారిన పడకుండా చూడొచ్చు.

News December 15, 2025

కవ్వాల్‌లో ఆధార్ స్పెషల్ క్యాంప్ ప్రారంభం

image

జన్నారం మండలం కవ్వాల్ గ్రామపంచాయతీలో అత్యవసర ఆధార్ ప్రత్యేక శిబిరం సోమవారం ప్రారంభమైంది. మంగళవారం కూడా కొనసాగుతుందని జన్నారం పోస్టల్ శాఖ ఏఎస్పీ రామారావు తెలిపారు. ఈ శిబిరంలో ప్రజలు తమ ఆధార్ కార్డుల్లోని తప్పుల సవరణ, ఫొటో అప్‌డేట్, చిరునామా, ఫోన్ నంబర్, పుట్టిన తేదీ మార్పులు వంటి అన్ని ముఖ్య సేవలను తక్షణమే వినియోగించుకోవాలని ఆయన కోరారు.