News February 18, 2025
కరీంనగర్: మార్చి 6 నుంచి ‘పల్లె బాట’: జక్కని

బీసీల పోరాటాన్ని తెలంగాణలోని పల్లెల్లో విస్తృత పరుస్తామని, దాని కోసం కార్యాచరణలు ముందుకు సాగుతున్నామని బీసీ ఆజాది ఫెడరేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు జక్కని సంజయ్ కుమార్ అన్నారు. కరీంనగర్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. బీసీల జాగృతి కోసం మార్చి 6 నుంచి గ్రామ గ్రామాన పల్లెబాట కార్యక్రమాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ పల్లెబాటని విజయవంతం చేయాలని కోరారు.
Similar News
News November 6, 2025
జీతాల కోసం ఎదురుచూపు: ఉద్యోగుల్లో తీవ్ర ఆవేదన

ప్రభుత్వ ఉద్యోగులకు ఇప్పటివరకు జీతాలు అందకపోవడంపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. కేవలం కొన్ని శాఖలకు మాత్రమే చెల్లింపులు జరిగాయని, రెవెన్యూ, దేవాదాయం వంటి కీలక శాఖల అధికారులకు కూడా జీతాలు విడుదల కాలేదని కాకినాడ జిల్లా ఉద్యోగ సంఘాలు తెలిపాయి. ఒకటో తేదీనే ఇస్తామని చెప్పినా కూటమి ప్రభుత్వం జీతాలు ఇవ్వకపోవడంతో, తాము బ్యాంకు రుణాల చెల్లింపులో డిఫాల్ట్ అవుతున్నామని ఉద్యోగులు వాపోతున్నారు.
News November 6, 2025
HLL లైఫ్కేర్ లిమిటెడ్లో 354 పోస్టులు

<
News November 6, 2025
విభిన్న ప్రతిభావంతులకు ఉచిత మూడు చక్రాల మోటార్ సైకిళ్లు

ఏలూరు జిల్లాలోని విభిన్న ప్రతిభావంతులకు పెట్రోల్తో నడిచే మూడు చక్రాల మోటార్ సైకిళ్లను ఉచితంగా అందిస్తున్నామని ఆ శాఖ జిల్లా మేనేజర్ రామ్ కుమార్ బుధవారం తెలిపారు. అర్హత గల 18 నుంచి 45 ఏళ్ల వారు www.apdascac.ap.gov.in వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఆన్లైన్ దరఖాస్తు, ఇతర పత్రాలను నవంబర్ 25లోగా ఏలూరు కార్యాలయంలో అందించాలని ఆయన స్పష్టం చేశారు.


