News February 18, 2025

కరీంనగర్: మార్చి 6 నుంచి ‘పల్లె బాట’: జక్కని 

image

బీసీల పోరాటాన్ని తెలంగాణలోని పల్లెల్లో విస్తృత పరుస్తామని, దాని కోసం కార్యాచరణలు ముందుకు సాగుతున్నామని బీసీ ఆజాది ఫెడరేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు జక్కని సంజయ్ కుమార్ అన్నారు. కరీంనగర్ ప్రెస్ క్లబ్‌లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. బీసీల జాగృతి కోసం మార్చి 6 నుంచి గ్రామ గ్రామాన పల్లెబాట కార్యక్రమాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ పల్లెబాటని విజయవంతం చేయాలని కోరారు.

Similar News

News February 24, 2026

భాగ్యనగరంలో భారీ వర్షం.. రాబోయే కొన్ని గంటలు అలర్ట్!

image

HYDలో అల్వాల్, సికింద్రాబాద్, జూబ్లీహిల్స్, బషీర్‌బాగ్ సహా అనేక ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. రాబోయే కొన్ని గంటల్లో GHMC వ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని HYD వాతావరణ కేంద్రం వెల్లడించింది. ముఖ్యంగా నగరంలోని ఉత్తర, పశ్చిమ ప్రాంతాల్లో వర్షం తీవ్రత అధికంగా ఉండొచ్చని మ్యాప్ విడుదల చేసింది. చాలా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడి చీకట్లు అలముకొన్నాయి.

News February 24, 2026

మహామృత్యుంజయ మంత్రం పఠిస్తే..

image

శివునికి అంకితం చేసిన ఈ మంత్రం అతి శక్తిమంతమైనది. దీనిని ‘మృత్యువును జయించే మంత్రం’ అంటారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నవారికి ఇది రక్షణ కవచంలా పనిచేస్తుంది. అకాల మృత్యు భయం పోవడానికి, త్వరగా కోలుకోవడానికి, శివుని రక్షణ పొందడానికి దీనిని పఠిస్తుంటారు.
మంత్రం: ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనమ్| ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయ మామృతాత్||

News February 24, 2026

30 లక్షల ఇళ్లపై సోలార్ వెలుగులు

image

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘PM సూర్య ఘర్: ముఫ్త్ బిజిలీ యోజన’కు అద్భుతమైన స్పందన వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఏడాది క్రితం ప్రారంభమైన ఈ పథకం ద్వారా ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 30 లక్షల గృహాల్లో రూఫ్‌టాప్ సోలార్ వ్యవస్థలను ఏర్పాటు చేసినట్లు మంత్రి ప్రహ్లాద్ జోషి వెల్లడించారు. ఈ ఘనతపై PM మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఇది భారత్ ఇంధన భద్రత, స్వయం సమృద్ధి దిశగా వేసిన కీలక అడుగు అని కొనియాడారు.