News January 28, 2025

కరీంనగర్: మా సమస్యను తీర్చండి.. ప్రజావాణికి ఫిర్యాదుల వెల్లువ

image

ప్రజావాణికి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. పలు సమస్యల్ని KNR కలెక్టర్‌కు విన్నవించారు. HZBకు చెందిన వీరగోని రవళి భర్త చనిపోగా.. తన ఇంటిని అత్త, మామ, ఆడపడుచులు అమ్మారని పేర్కొంది. రోడ్డు విస్తరణ పేరుతో నిర్మాణాలు కూల్చివేతలు చేస్తున్నారని తీగలగుట్టపల్లికి చెందిన పలువురు ఫిర్యాదు చేశారు. అనుమతి లేకుండా ఇటుక బట్టీలు నిర్వహిస్తున్నారని ఇరుకుల్లకు గ్రామస్థులు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు.

Similar News

News February 16, 2025

కరీంనగర్: గనుల శాఖ ముఖ్య కార్యదర్శిని కలిసిన కలెక్టర్

image

కరీంనగర్‌లోని ఆర్ అండ్ బి వసతి గృహంలో గనుల శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీధర్‌ను జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయనకు మొక్కతో స్వాగతం పలికారు. జిల్లాలో ఇసుక యార్డులు, ఇసుక లారీల బుకింగ్‌లు, నిల్వల వివరాలను జిల్లా అధికారులు తీసుకుంటున్న చర్యలను కలెక్టర్ ఆయనకు వివరించారు.

News February 15, 2025

శంకరపట్నం: ‘15 రోజుల్లోనే 39 మంది గాయపడ్డారు’

image

శంకరపట్నం మండలంలోని పలు గ్రామాల్లో కోతులు, కుక్కలు స్వైరవిహారం చేస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు వాటి ధాటిని తట్టుకోలేక పోతున్నారు. గడిచిన 15 రోజుల్లోనే వాటి దాడిలో 39 మంది గాయపడ్డారని వైద్యాధికారి డా.శ్రావణ్ తెలిపారు. జనవరి మాసంలో 42 మంది కుక్క కాటుకు, 46 మంది కోతుల దాడికి గురైనట్లు వెల్లడించారు. 

News February 15, 2025

శంకరపట్నం: తాటిచెట్టు పైనుంచి పడిన గీత కార్మికుడు

image

తాటిచెట్టు పైనుంచి పడి గీత కార్మికుడు తీవ్రంగా గాయపడిన ఘటన మండలంలోని కరీంపేటలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన గుర్రం వీరాస్వామి శనివారం సాయంత్రం గ్రామ శివారులోని ఓ తాటి చెట్టుపై కల్లు గీసి దిగుతుండగా కిందపడినట్లు స్థానికులు తెలిపారు. అతడు తీవ్రంగా గాయపడటంతో వెంటనే అంబులెన్సులో ఆసుపత్రికి తరలించారు.

error: Content is protected !!