News February 11, 2025

కరీంనగర్: ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్లు

image

కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్ పట్టభద్రులు, ఉపాధ్యాయుల శాసనమండలి ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ఘట్టం నిన్నటితో ముగిసింది. సోమవారం పోటాపోటీగా ర్యాలీలు నిర్వహించి నామినేషన్లు వేశారు. మొత్తం పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి 100 మంది, ఉపాధ్యాయుల స్థానానికి 17 మంది నామినేషన్లు వేశారు. నేడు నామినేషన్లను పరిశీలిస్తారు. ఉపసంహరణకు ఈనెల 13న మధ్యాహ్నం 3 గంటల వరకు అవకాశం ఉంటుంది.

Similar News

News November 25, 2025

12,735లో బీసీలకు 2,176 గ్రామ పంచాయతీలే!

image

TG: 12,735 గ్రామాలకు గాను 2,176 గ్రామాలే బీసీలకు రిజర్వు అయ్యాయి. ఈ లెక్కన 17.08% రిజర్వేషన్లు అమలు చేశారు. భద్రాద్రి జిల్లాలో 471కి గాను ఒక్కటీ బీసీలకు దక్కలేదు. అత్యధికంగా సిద్దిపేట జిల్లాలో 508కి గాను 136 కేటాయించారు. గత ఎన్నికల్లో BCలకు 20% రిజర్వేషన్లు దక్కినా ఈసారి రొటేషన్ల వల్ల తగ్గినట్లు సమాచారం. అటు BCలకు 42% రిజర్వేషన్లు అమలు చేస్తామని ప్రభుత్వం ప్రకటించినా కోర్టు కేసులతో సాధ్యం కాలేదు.

News November 25, 2025

మహబూబాబాద్ జిల్లాలో 3 విడతల్లో ఎన్నికలు

image

మహబూబాబాద్ జిల్లాలోని 482 పంచాయతీలకు ఎన్నికలను 3 దశల్లో నిర్వహించనున్నారు. మొదటి దశలో గూడూరు, ఇనుగుర్తి, కేసముద్రం, మహబూబాబాద్, నెల్లికుదురులోని 155 పంచాయతీలకు నిర్వహించనున్నారు. 2వ దశలో బయ్యారం, చిన్నగూడూరు, దంతాలపల్లి, గార్ల, నర్సింహులపేట, పెద్ద వంగర, తొర్రూర్‌లోని 158 పంచాయతీలకు నిర్వహించనున్నారు. 3వ దశలో డోర్నకల్, గంగారం, కొత్తగూడ, కురవి మరిపెడ, సీరోలు మండలాల్లోని 169 పంచాయతీలకు జరుగనున్నాయి.

News November 25, 2025

గొల్లపల్లి: జాతరకు వచ్చే భక్తులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు

image

గొల్లపల్లి (M) మల్లన్న పేటలో బుధవారం నుంచి ప్రారంభం కానున్న మల్లన్న జాతర ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టినట్లు జగిత్యాల డీఎస్పీ రఘుచందర్ అన్నారు. మల్లన్నపేట గ్రామంలో పోలీస్ సిబ్బందికి బందోబస్తు, తదితర విషయాలపై అవగాహన కల్పించారు. ధర్మపురి సీఐ రామ్ నరసింహారెడ్డి, గొల్లపల్లి ఎస్ఐ కృష్ణ సాగర్ రెడ్డి, ధర్మపురి, వెల్గటూర్ ఎస్సైలు పాల్గొన్నారు.