News February 11, 2025

కరీంనగర్: ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్లు

image

కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్ పట్టభద్రులు, ఉపాధ్యాయుల శాసనమండలి ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ఘట్టం నిన్నటితో ముగిసింది. సోమవారం పోటాపోటీగా ర్యాలీలు నిర్వహించి నామినేషన్లు వేశారు. మొత్తం పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి 100 మంది, ఉపాధ్యాయుల స్థానానికి 17 మంది నామినేషన్లు వేశారు. నేడు నామినేషన్లను పరిశీలిస్తారు. ఉపసంహరణకు ఈనెల 13న మధ్యాహ్నం 3 గంటల వరకు అవకాశం ఉంటుంది.

Similar News

News December 19, 2025

తూ.గో జిల్లాలో ఉద్యోగాలు.. 12 రోజులే గడువు!

image

రాజమండ్రిలోని లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ సిస్టమ్ కార్యాలయంలో ఖాళీగా ఉన్న ఛీఫ్, డిప్యూటీ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా జడ్జీ సునీత శుక్రవారం తెలిపారు. అర్హత కలిగిన న్యాయవాదులు ఈనెల 31వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. వివరాలు జిల్లా న్యాయస్థాన అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయని ఆమె పేర్కొన్నారు.

News December 19, 2025

Unknown నంబర్ నుంచి వీడియో కాల్ చేసి..

image

అన్‌నోన్ నంబర్ల నుంచి వచ్చే వీడియో కాల్స్ లిఫ్ట్ చేయొద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఇలా ఓ మహిళతో వీడియో కాల్ మాట్లాడిన HYD వ్యక్తి బ్లాక్‌మెయిల్‌కు గురై ₹3.41L పోగొట్టుకున్నాడు. మహిళ వీడియో కాల్ చేసి అతడిని సెడ్యూస్ చేయగా, అది వైరల్ చేస్తామంటూ మరో వ్యక్తి బెదిరించాడు. పలుమార్లు డబ్బులు వసూలు చేశాడు. తన బ్యాంక్ అకౌంట్స్ హ్యాకవడం, మరిన్ని డబ్బులు డిమాండ్ చేయడంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు.

News December 19, 2025

GWL: విపత్తులు ఎదుర్కొనే అవగాహన కలిగి ఉండాలి-CS

image

వరదలు ప్రమాదాలతో పాటు వివిధ రకాల విపత్తుల సమయంలో తీసుకోవలసిన జాగ్రత్తలపై సంబంధిత శాఖల యంత్రాంగానికి అవగాహన ఉండాలని సీఎస్ రామకృష్ణారావు పేర్కొన్నారు. NDMA డైరెక్టర్ సుధీర్ బాల్, టీజీ ఫైర్ సర్వీస్ డైరెక్టర్ నారాయణ రావుతో కలెక్టర్లతో శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. గద్వాల జిల్లా యంత్రాంగం విపత్తుల వల్ల ప్రజలకు ఇబ్బంది లేకుండా కృషి చేస్తున్నట్లు అడిషనల్ కలెక్టర్ లక్ష్మీనారాయణ తెలిపారు.