News February 11, 2025
కరీంనగర్: ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్లు

కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్ పట్టభద్రులు, ఉపాధ్యాయుల శాసనమండలి ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ఘట్టం నిన్నటితో ముగిసింది. సోమవారం పోటాపోటీగా ర్యాలీలు నిర్వహించి నామినేషన్లు వేశారు. మొత్తం పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి 100 మంది, ఉపాధ్యాయుల స్థానానికి 17 మంది నామినేషన్లు వేశారు. నేడు నామినేషన్లను పరిశీలిస్తారు. ఉపసంహరణకు ఈనెల 13న మధ్యాహ్నం 3 గంటల వరకు అవకాశం ఉంటుంది.
Similar News
News November 16, 2025
ఆ ఐదేళ్లు రాష్ట్రానికి బ్యాడ్ పీరియడ్: చంద్రబాబు

AP: 2019-24 కాలం రాష్ట్రానికి బ్యాడ్ పీరియడ్ అని సీఎం చంద్రబాబు అన్నారు. ఆ సమయంలో ఇండస్ట్రీలను ధ్వంసం చేశారని మండిపడ్డారు. సోలార్ రంగం అభివృద్ధి చెందకుండా కుట్రలు చేశారని ఆరోపించారు. ఇప్పుడు ఎకో సిస్టమ్ నిర్మించే పనిలో ఉన్నామని తెలిపారు. ఈ కారణంతోనే రాష్ట్రానికి గూగుల్ వచ్చిందని పేర్కొన్నారు. 2047 వికసిత్ భారత్ లక్ష్యాలకు అనుగుణంగా పాలసీలు తయారు చేస్తున్నామని చెప్పారు.
News November 16, 2025
ఖమ్మం జిల్లాలో 3.5 కోట్ల చేప పిల్లల విడుదల: కలెక్టర్

ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 224 మత్స్యకార సంఘాల ఆధ్వర్యంలో 3.5 కోట్ల చేప పిల్లలను నీటి వనరుల్లో విడుదల చేస్తున్నట్లు కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. చెరువుల్లో ఫీడ్ సక్రమంగా అందేలా, నీరు కలుషితంగాకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఖమ్మం నియోజకవర్గంలో 17 లక్షల చేప పిల్లలను ఉచితంగా విడుదల చేస్తున్నామని చెప్పారు. ప్రమాదాల్లో మృతి చెందిన కనకయ్య, మంగయ్య కుటుంబాలకు రూ.5 లక్షల బీమా చెక్కును అందజేశారు.
News November 16, 2025
వారణాసి: ఒకేసారి ఇన్ని సర్ప్రైజులా?

రాజమౌళి, మహేశ్ బాబు కాంబోలో తెరకెక్కుతున్న ‘<<18299698>>వారణాసి<<>>’ నుంచి వరుస అప్డేట్స్ వచ్చాయి. globe trotter ఈవెంట్లో మూవీ టైటిల్, మహేశ్ ఫస్ట్ లుక్, 3.40 నిమిషాల గ్లింప్స్ రిలీజ్ చేశారు. 2027 సమ్మర్లో మూవీ విడుదల అని కీరవాణి తెలిపారు. రామాయణంలో ముఖ్యమైన <<18299599>>ఘట్టం <<>>తీస్తున్నానని, మహేశ్కు రాముడి వేషం వేశానని రాజమౌళి వెల్లడించారు. దీంతో ఒకేసారి ఇన్ని సర్ప్రైజులు ఇచ్చారని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.


