News May 18, 2024
కరీంనగర్: ముగ్గురు టీచర్ల సస్పెన్షన్.!

కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం నవాబుపేట ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయురాలు మంగ, సైదాపూర్ మండలం నల్లోనితండా పాఠశాల ఉపాధ్యాయురాలు సునీతలను డీఈవో జనార్దన్రావు సస్పెండ్ చేశారు. ఆయా పాఠశాలల్లో అనధికారిక వ్యక్తులు నివాసం ఉంటున్నారనే సమాచారం తెలియజేయకపోవడంతో విధుల నుంచి తొలగించారు. అదేవిధంగా కరీంనగర్ పట్టణం ఫకీర్ నగర్ స్కూల్ టీచర్ మంజులను విధులకు గైర్హాజరు కారణంగా సస్పెండ్ చేశారు.
Similar News
News October 29, 2025
‘ప్రభుత్వ సిబ్బంది బాధ్యతాయుతంగా వ్యవహరించాలి’

ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు బాధ్యతాయుతంగా వ్యవహరించి, ప్రజలకు నిష్పక్షపాతంగా సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సూచించారు. మంగళవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాలులో విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ ఆధ్వర్యంలో జరిగిన అవగాహన సమావేశంలో ఆమె మాట్లాడారు. ప్రభుత్వ సేవల్లో నిజాయితీ పెంచాలని, ప్రతి ఉద్యోగికి తన పనిలో జవాబుదారీతనం ఉండాలని కలెక్టర్ స్పష్టం చేశారు.
News October 28, 2025
కరీంనగర్లో పీజీ వైద్య విద్యార్థి ఆత్మహత్య

కరీంనగర్ ప్రతిమ వైద్య కళాశాలలో పీజీ ద్వితీయ సంవత్సరం అనస్తీషియా విభాగంలో చదువుతున్న శ్రీనివాస్ అనే వైద్య విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మత్తు ఇంజక్షన్ తీసుకుని తన గదిలోనే ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ విషాదం సంఘటనతో కళాశాల పరిసరాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News October 28, 2025
KNR: సీసీఎస్ PS నూతన కార్యాలయం ప్రారంభం

సెంట్రల్ క్రైమ్ స్టేషన్(సీసీఎస్) పోలీస్ స్టేషన్ నూతన భవనాన్ని సీపీ గౌష్ ఆలం ప్రారంభించారు. గతంలో కరీంనగర్ టూ టౌన్ పోలీస్ స్టేషన్ భవనంపైన పనిచేసిన సీసీఎస్ పోలీస్ స్టేషన్ను కరీంనగర్ రూరల్ ఏసీపీ కార్యాలయ కాంపౌండ్లో నిర్మించిన నూతన భవనంలోకి తరలించారు. నూతన భవనం ద్వారా సీసీఎస్ పోలీస్ స్టేషన్ సిబ్బందికి మెరుగైన వాతావరణం లభిస్తుందని, వారు మరింత సమర్థవంతంగా సేవలు అందించగలరని సీపీ ఆశాభావం వ్యక్తం చేశారు.


