News February 9, 2025
కరీంనగర్: రేపటితో ముగియనున్న నామినేషన్లు

KNR, ADLBD, NZBD, MDK పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికకు రేపటితో నామినేషన్ల గడువు ముగియనుంది. ఇప్పటిదాకా BJP, కాంగ్రెస్ అభ్యర్థులతో పాటు 49 మంది నామినేషన్ వేశారు. ఉపాధ్యాయ స్థానానికి బీజేపీ అభ్యర్థితో పాటు PRTUTS, TPTF అభ్యర్థులు, సిట్టింగ్ ఎమ్మెల్సీ రఘోత్తంరెడ్డి, మరో 5గురు నామినేషన్లు వేశారు. పట్టభద్రుల స్థానంలో ప్రస్తుతం కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి ఎమ్మెల్సీగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
Similar News
News November 21, 2025
పల్నాడు వీరుల ఉత్సవాలలో నేడు మందపోరు

పల్నాడు వీరుల ఉత్సవాలలో మూడో రోజు శుక్రవారం మందపోరు నిర్వహించనున్నారు. మలిదేవ, బ్రహ్మన్న పరివారం అరణ్యవాస సమయంలో నల్లమల మండాది ప్రాంతంలో ఆవులను మేపేవారు. కుట్రతో నాగమ్మ వర్గీయులు ఆవులను వధిస్తారు. ఆవులు రక్షించుకునేందుకు లంకన్న భీకర యుద్ధం చేసి వీర మరణం పొందుతాడు. దీంతో బ్రహ్మనాయుడు ఆగ్రహం కట్టలు తెచ్చుకుంటుంది. నాడు కుల మతాలకు అతీతంగా బ్రహ్మనాయుడు చేపట్టిన చాప కూడు సిద్ధాంతం నేటికీ కొనసాగుతోంది.
News November 21, 2025
నాగార్జునసాగర్-శ్రీశైలం వెళ్తున్నారా?.. మీ కోసమే

నాగార్జునసాగర్-శ్రీశైలం మధ్య లాంచీ ప్రయాణం రేపటి నుంచి ప్రారంభం కానుంది. ప్రతీ శనివారం సాగర్ జలాశయం నుంచి కృష్ణా నదిలో నల్లమల అటవీ అందాల నడుమ సాగే ఈ లాంచీ ప్రయాణానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని పర్యాటక అభివృద్ధి సంస్థ అధికారులు వెల్లడించారు. లాంచీ ప్రయాణానికి సంబంధించిన టికెట్ ధరలను అధికారులు ప్రకటించారు. వన్ వే ప్రయాణం పెద్దలకు రూ.2 వేలు, 5 – 10 పిల్లలకు రూ.1600లుగా ధర నిర్ణయించారు.
News November 21, 2025
ఖనిజ రవాణా వాహనాలకు రిజిస్ట్రేషన్ తప్పనిసరి

నల్గొండ జిల్లాలో కంకర, ఇసుక, ఇటుక వంటి ఖనిజాలను రవాణా చేసే వాహనాలు తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని మైన్స్ ఏడీ సామ్యేల్ జాకాబ్ స్పష్టం చేశారు. రిజిస్ట్రేషన్ లేకుండా ఖనిజాలను సరఫరా చేస్తే జరిమానాలతో పాటు కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. కలెక్టర్ ఆధ్వర్యంలోని డీఎల్ఎస్ కమిటీ నిర్ణయం మేరకు, వినియోగదారులకు ఇసుక సరసమైన ధరలకే అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.


