News February 9, 2025
కరీంనగర్: రేపటితో ముగియనున్న నామినేషన్లు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739071320199_1259-normal-WIFI.webp)
KNR, ADLBD, NZBD, MDK పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికకు రేపటితో నామినేషన్ల గడువు ముగియనుంది. ఇప్పటిదాకా BJP, కాంగ్రెస్ అభ్యర్థులతో పాటు 49 మంది నామినేషన్ వేశారు. ఉపాధ్యాయ స్థానానికి బీజేపీ అభ్యర్థితో పాటు PRTUTS, TPTF అభ్యర్థులు, సిట్టింగ్ ఎమ్మెల్సీ రఘోత్తంరెడ్డి, మరో 5గురు నామినేషన్లు వేశారు. పట్టభద్రుల స్థానంలో ప్రస్తుతం కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి ఎమ్మెల్సీగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
Similar News
News February 11, 2025
సారీ చెప్పిన హీరో.. అయినా తగ్గమంటున్న వైసీపీ ఫ్యాన్స్!
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739221595901_893-normal-WIFI.webp)
‘లైలా’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీరాజ్ వ్యాఖ్యలపై చెలరేగిన <<15417744>>వివాదం<<>> కొనసాగుతోంది. హీరో విశ్వక్సేన్ సారీ చెప్పినా వైసీపీ ఫ్యాన్స్ తగ్గటం లేదు. పృథ్వీరాజ్తో క్షమాపణలు చెప్పించాలని డిమాండ్ చేస్తున్నారు. 115K+ ట్వీట్లతో #BoycottLaila ఇంకా Xలో ట్రెండ్ అవుతోంది. మరి దీనిపై మరోసారి మూవీ టీమ్ నుంచి ఏదైనా ప్రకటన వస్తుందేమో చూడాలి. ఈ సినిమా ఈనెల 14న థియేటర్లలోకి రానుంది.
News February 11, 2025
పదీ పరీక్షలు పగడ్బందీగా నిర్వహించాలి: జిల్లా కలెక్టర్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739195168003_51732952-normal-WIFI.webp)
జిల్లాలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ నెల 17 నుంచి 31 వరకు పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జిల్లావ్యాప్తంగా 10,454 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతారని అన్నారు. పరీక్ష కేంద్రాల ద్వారా 144 సెక్షన్ అమల్లో ఉంటుందన్నారు.
News February 11, 2025
పోక్సో కేసులో నిందితుడికి ఏడేళ్ల జైలు శిక్ష: SP
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739190703669_52016869-normal-WIFI.webp)
పూసపాటిరేగ పోలీస్ స్టేషన్లో 2024లో నమోదైన పోక్సో కేసులో నిందితుడికి రూ.3 వేల జరిమానా, ఏడేళ్ల కఠిన కారాగార శిక్షను జిల్లా కోర్టు ఖరారు చేసిందని ఎస్పీ వకుల్ జిందాల్ సోమవారం తెలిపారు. పెద్ద పతివాడకు చెందిన హరీష్ ఐదేళ్ల మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడినట్లు తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి కోర్టులో ప్రవేశపెట్టామని.. నేరం రుజువు కావడంతో నిందితుడికి శిక్ష పడిందన్నారు.