News February 9, 2025

కరీంనగర్: రేపటితో ముగియనున్న నామినేషన్లు

image

KNR, ADLBD, NZBD, MDK పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికకు రేపటితో నామినేషన్ల గడువు ముగియనుంది. ఇప్పటిదాకా BJP, కాంగ్రెస్ అభ్యర్థులతో పాటు 49 మంది నామినేషన్ వేశారు. ఉపాధ్యాయ స్థానానికి బీజేపీ అభ్యర్థితో పాటు PRTUTS, TPTF అభ్యర్థులు, సిట్టింగ్ ఎమ్మెల్సీ రఘోత్తంరెడ్డి, మరో 5గురు నామినేషన్లు వేశారు. పట్టభద్రుల స్థానంలో ప్రస్తుతం కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి ఎమ్మెల్సీగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

Similar News

News October 23, 2025

నక్కపల్లి: రేపు రాజయ్యపేటలో పర్యటించనున్న కలెక్టర్

image

జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ ఈ నెల 24న రాజయ్యపేటలో పర్యటించనున్నారు. ఈ విషయాన్ని నక్కపల్లి తహసిల్దార్ నరసింహా మూర్తి బుధవారం తెలిపారు. బల్క్ డ్రగ్ పార్క్ రద్దు చేయాలని మత్స్యకారులు గ్రామంలో రిలే దీక్షలు చేస్తున్నారు.ఈ నేపథ్యంలో ఈనెల 19న గ్రామానికి వస్తానని కలెక్టర్ సమాచారం ఇచ్చారు. అయితే సమయం తక్కువగా ఉన్నందున మరో రోజు రావాలని మత్స్యకారులు విజ్ఞప్తి చేశారు.

News October 23, 2025

MBNR: జర్మనీలో ఉద్యోగాలు.. రేపు శిక్షణ

image

MBNR ప్రభుత్వ ఐటిఐ బాలుర క్యాంపస్‌లోని ఏటీసీ భవనంలో జర్మన్ భాషా శిక్షణ(A2 స్థాయి శిక్షణ) నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ శాంతయ్య Way2Newsతో తెలిపారు. ఈ శిక్షణ రేపు రాష్ట్ర ప్రభుత్వ సంస్థ తెలంగాణ ఓవర్సీస్ మాన్ పవర్ కంపెనీ లిమిటెడ్(TOMCOM) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నామని, జర్మనీలో ఉద్యోగాలు, ప్రయోజనాల గురించి వివరిస్తామని, ఎలక్ట్రిషన్ ట్రేడ్ లో 60% మార్కులు ఉండాలని, వయస్సు 19-30లోపు ఉండాలన్నారు.

News October 23, 2025

బాడీలోషన్నే ముఖానికి వాడుతున్నారా?

image

చర్మానికి తేమను అందించడానికి చాలామంది బాడీలోషన్ వాడుతుంటారు. కానీ కొంతమంది ఈ లోషన్నే ఫేస్​కి కూడా వాడుతుంటారు. దీనివల్ల ముఖంపై మొటిమలు పెరుగుతాయంటున్నారు నిపుణులు. ఇందులో వాడే కృత్రిమ పరిమళాలు మృదువుగా ఉండే ముఖ చర్మంపై అలర్జీలు రావడానికి కారణం అవుతుందంటున్నారు. కాబట్టి ముఖం కోసం ప్రత్యేకంగా తయారుచేసిన ఉత్పత్తులను వాడాలని సూచిస్తున్నారు.