News February 9, 2025

కరీంనగర్: రేపటితో ముగియనున్న నామినేషన్లు

image

KNR, ADLBD, NZBD, MDK పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికకు రేపటితో నామినేషన్ల గడువు ముగియనుంది. ఇప్పటిదాకా BJP, కాంగ్రెస్ అభ్యర్థులతో పాటు 49 మంది నామినేషన్ వేశారు. ఉపాధ్యాయ స్థానానికి బీజేపీ అభ్యర్థితో పాటు PRTUTS, TPTF అభ్యర్థులు, సిట్టింగ్ ఎమ్మెల్సీ రఘోత్తంరెడ్డి, మరో 5గురు నామినేషన్లు వేశారు. పట్టభద్రుల స్థానంలో ప్రస్తుతం కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి ఎమ్మెల్సీగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

Similar News

News December 3, 2025

టాటా ట్రస్ట్ ఎలక్షన్ ఫండ్స్.. 83 శాతం బీజేపీకే

image

2024-25 లోక్‌సభ ఎలక్షన్ ఇయర్‌లో టాటా గ్రూప్‌ అనుబంధ ప్రోగ్రెసివ్ ఎలక్టోరల్ ట్రస్ట్ నుంచి BJPకి రూ.757 కోట్ల ఫండ్స్ అందాయి. ట్రస్ట్ అందించిన మొత్తం నిధుల్లో ఇది 83% కాగా 8.4% వాటాతో కాంగ్రెస్‌ రూ.77.3 కోట్లు అందుకుంది. ఈసీకి అందించిన వివరాల ప్రకారం.. లోక్‌సభ ఎన్నికల సమయంలో BJP, కాంగ్రెస్ సహా 10 రాజకీయ పార్టీలకు రూ.914 కోట్ల నిధులొచ్చాయి. YCP, BRS తదితర పార్టీలకు చెరో రూ.10 కోట్లు ఇచ్చింది.

News December 3, 2025

ఖమ్మం జిల్లాలో 6 బయో-ఇన్‌పుట్ సెంటర్లు

image

రాష్ట్రంలో సేంద్రీయ సాగు ప్రోత్సాహకానికి 250 బయో-ఇన్‌పుట్ రిసోర్స్ సెంటర్‌లను గుర్తించినట్లు కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి రామ్ నాథ్ ఠాకూర్ తెలిపారు. లోక్‌సభ సమావేశాల్లో ఖమ్మం ఎంపీ రఘురాంరెడ్డి అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. జిల్లాలో ఇటువంటి కేంద్రాలు ఆరు ఉన్నాయని మంత్రి పేర్కొన్నారు. ఈ కేంద్రాల ద్వారా రైతులకుబీజామృత్, జీవామృత్, నీమాస్త్రం వంటి సేంద్రీయ ఎరువులను అందిస్తున్నట్లు వెల్లడించారు.

News December 3, 2025

నామినేషన్ల కేంద్రాలను తనిఖీ చేసిన ఇన్‌ఛార్జ్ కలెక్టర్

image

గ్రామ పంచాయతీ మూడో విడత ఎన్నికల నామినేషన్ కేంద్రాన్ని ఇన్‌ఛార్జ్ కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి గరిమా అగర్వాల్ బుధవారం పరిశీలించారు. గంభీరావుపేట మండల కేంద్రంలో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను ఆమె తనిఖీ చేశారు. నామినేషన్‌తోపాటు అభ్యర్థి నూతన బ్యాంక్ ఖాతా కచ్చితంగా కలిగి ఉండాలని, అన్ని వివరాలు నింపాలని ఇన్‌ఛార్జ్ కలెక్టర్ సూచించారు. హెల్ప్ డెస్క్ పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు.