News February 9, 2025
కరీంనగర్: రేపటితో ముగియనున్న నామినేషన్లు

KNR, ADLBD, NZBD, MDK పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికకు రేపటితో నామినేషన్ల గడువు ముగియనుంది. ఇప్పటిదాకా BJP, కాంగ్రెస్ అభ్యర్థులతో పాటు 49 మంది నామినేషన్ వేశారు. ఉపాధ్యాయ స్థానానికి బీజేపీ అభ్యర్థితో పాటు PRTUTS, TPTF అభ్యర్థులు, సిట్టింగ్ ఎమ్మెల్సీ రఘోత్తంరెడ్డి, మరో 5గురు నామినేషన్లు వేశారు. పట్టభద్రుల స్థానంలో ప్రస్తుతం కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి ఎమ్మెల్సీగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
Similar News
News September 18, 2025
HYD: ఆచార్య ఎస్వీ రామారావు నిర్యాణం పట్ల తెలుగు వర్సిటీ సంతాపం

తెలంగాణ సాహిత్య చరిత్ర నిర్మాణంపై దృష్టి పెట్టి పరిశోధన చేసిన గొప్ప సాహితీ వేత్త సూగూరు వేంకటరామారావు అని, వారి నిర్యాణం పట్ల తెలుగు విశ్వవిద్యాలయం ప్రగాఢ సంతాపాన్ని ప్రకటించింది. OU తెలుగు శాఖ పూర్వాచార్యులుగా, కేంద్రీయ విశ్వవిద్యాలయం, కాకతీయ విశ్వవిద్యాలయం, బెనారస్, బెంగళూరు విశ్వవిద్యాలయాల్లో విజిటింగ్ ప్రొఫెసర్గా పనిచేశారని, ఎస్వీ రామారావు మృతిపట్ల వారి కుటుంబానికి సానుభూతిని ప్రకటించారు.
News September 18, 2025
VKB: క్రీడాస్ఫూర్తి ప్రదర్శించాలి: VC

తెలుగు వర్శిటీలోని బాచుపల్లి ప్రాంగణంలో ఫిజికల్ ఎడ్యుకేషన్ విభాగం ఆధ్వర్యంలో పలు విభాగాలలో అధ్యాపకులకు అధ్యాపకేతురులకు క్రీడా పోటీలు నిర్వహించారు. ఈ పోటీలను ముఖ్యఅతిథిగా ఉపకులపతి(VC) ఆచార్య నిత్యానందరావు హాజరై ప్రారంభించారు. క్రీడా స్ఫూర్తిని చాటడం ద్వారా భావోద్వేగాలని ఎలా నియంత్రించుకోవాలో తెలుస్తుందన్నారు. స్పోర్ట్స్ కో-ఆర్డినేటర్ ఆర్.గోపాల్, వర్శిటీ సిబ్బంది తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
News September 17, 2025
16 ఏళ్ల నాటి పోరాటం గుర్తుచేసుకున్న MLC కవిత

తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం తీవ్రంగా సాగుతున్న సమయంలో, 2009లో వ్యవసాయ విశ్వవిద్యాలయం వేదికగా జరిగిన తెలంగాణ విలీన దినోత్సవం వేడుకల జ్ఞాపకాలను ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తన ‘X’ ఖాతాలో పంచుకున్నారు. వ్యవసాయ విశ్వవిద్యాలయం తెలంగాణ ఉద్యమానికి ఒక ప్రధాన కేంద్రంగా ఉన్న రోజులవి. ఆనాటి పోరాట స్ఫూర్తిని, యువతలో ఉన్న ఉత్సాహాన్ని మరోసారి ఆమె గుర్తుచేశారు.