News February 9, 2025
కరీంనగర్: రేపటితో ముగియనున్న నామినేషన్లు

KNR, ADLBD, NZBD, MDK పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికకు రేపటితో నామినేషన్ల గడువు ముగియనుంది. ఇప్పటిదాకా BJP, కాంగ్రెస్ అభ్యర్థులతో పాటు 49 మంది నామినేషన్ వేశారు. ఉపాధ్యాయ స్థానానికి బీజేపీ అభ్యర్థితో పాటు PRTUTS, TPTF అభ్యర్థులు, సిట్టింగ్ ఎమ్మెల్సీ రఘోత్తంరెడ్డి, మరో 5గురు నామినేషన్లు వేశారు. పట్టభద్రుల స్థానంలో ప్రస్తుతం కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి ఎమ్మెల్సీగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
Similar News
News November 20, 2025
ఆవులతో డెయిరీఫామ్ ఎందుకు మేలంటే?

హోలిస్టిన్ ఫ్రీజియన్ జాతి ఆవులు ఒక ఈతకు 3000 నుంచి 3500 లీటర్ల పాలను ఇస్తాయి. వీటి పాలలో వెన్నశాతం 3.5-4% ఉంటుంది. జెర్సీ జాతి ఆవు ఒక ఈతకు 2500 లీటర్ల పాలనిస్తుంది. పాలలో వెన్నశాతం 4-5% ఉంటుంది. ఒక ఆవు ఏడాదికి ఒక దూడను ఇస్తూ.. మనం సరైన దాణా, జాగ్రత్తలు తీసుకుంటే 10 నెలలు కచ్చితంగా పాలిస్తుంది. ఒక ఆవు రోజుకు కనీసం 12-13 లీటర్లు పాలిస్తుంది కనుక పాడి రైతుకు ఏడాదిలో ఎక్కువ కాలం ఆదాయం వస్తుంది.
News November 20, 2025
పరకామణి కేసుపై తర్జనభర్జన..?

హైకోర్టు ఆదేశాలతో తిరుమల శ్రీవారి పరకామణి కేసు విచారణను CID బృందం వేగవంతం చేసింది. పరకామణి చోరీపై మరోసారి తిరుమల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని TTD బోర్డు నిర్ణయించింది. హైకోర్టు పరిశీలనలో ఉన్న కేసుపై మరోసారి కేసు ఎలా నమోదు చేయాలని పోలీసుల తర్జనభర్జన పడుతున్నట్లు సమాచారం. కేసును పోలీసులకు ఇవ్వాలా? లేదా హైకోర్టుకు నివేదించాలా? లేదా CIDకే మరోసారి ఫిర్యాదు చేయాలా? అనే దానిపై చర్చలు జరుగుతున్నాయి.
News November 20, 2025
తప్పుల సవరణకు ఈ ఒక్కరోజే ఛాన్స్!

TG: గ్రామ పంచాయతీలు, వార్డు ఓటరు జాబితాలో <<18333411>>తప్పులు<<>> ఉంటే సవరించుకునేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం అవకాశం కల్పించింది. పొరపాట్ల సవరణకు ఈ ఒక్కరోజు మాత్రమే ఓటర్ల నుంచి దరఖాస్తులు స్వీకరించనుంది. 22న జిల్లా పంచాయతీ అధికారులు వాటిని పరిశీలించి పరిష్కరిస్తారని SEC పేర్కొంది. 23న తుది ఓటరు జాబితాను ప్రచురిస్తారు. https://tsec.gov.in/లోకి వెళ్లి మీ పేరును చెక్ చేసుకొని తప్పులుంటే GPలో సంప్రదించాలి.


