News May 23, 2024
కరీంనగర్: రేపటి నుంచి ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు

ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ నెల 24 నుంచి 31వ తేదీ వరకు కరీంనగర్ జిల్లాలో పరీక్షలను నిర్వహిస్తున్నారు. పరీక్షల కోసం 31 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రథమ సంవత్సరంలో 10,073 మంది, ద్వితీయ సంవత్సరంలో 4,907 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. పరీక్ష కేంద్రాలకు గంట ముందు విద్యార్థులు చేరుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
Similar News
News December 4, 2025
KNR: పంచాయతీ ఎన్నికల నిర్వహణపై వీడియో కాన్ఫరెన్స్

పంచాయతీ ఎన్నికల నిర్వహణపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించిన ఎన్నికల సంఘం కమిషనర్ జిల్లాలలో పంచాయతీ ఎన్నికలను నిబంధన ప్రకారం నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ ఐ.రాణి కుముదిని అన్నారు. పంచాయతీ ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ ఐ.రాణి కుముదిని కలెక్టర్లతో గురువారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. తదితర అంశాల పట్ల ఎన్నికల కమిషనర్ రివ్యూ నిర్వహించారు.
News December 3, 2025
కరీంనగర్: యువకుడిపై పోలీసుల థర్డ్ డిగ్రీ..?

యువకుడిని రక్తం వచ్చేలా పోలీసులు విచక్షణారహితంగా కొట్టిన ఘటన కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. 24 గంటలపాటు పోలీసులు అధీనంలో ఉంచుకొని రాత్రి 9:30కు జైలుకు తరలించడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ‘నా కొడుకు చేసిన నేరమేంటి? ఇంతగా ఎందుకు హింసిస్తున్నారు’ అంటూ తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు. దీనిపై CP జోక్యం చేసుకొని వాస్తవాలు వెల్లడించాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి.
News December 3, 2025
గన్నేరువరం: ‘క్రీడల్లోనూ బాలికలు ముందుండాలి’

బాలికలు చదువుతో పాటు క్రీడల్లోనూ ముందుండి, అత్యుత్తమ ప్రతిభ కనబరచాలని అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే పేర్కొన్నారు. స్నేహిత అవగాహన కార్యక్రమంలో భాగంగా మంగళవారం తిమ్మాపూర్ కేజీబీవీ, గన్నేరువరం పాఠశాలలను ఆమె సందర్శించారు. అన్ని రంగాల్లోనూ ప్రతిభ చూపాలని బాలికలకు సూచించారు. ఏదైనా ఇబ్బంది ఉంటే వెంటనే హెల్ప్లైన్ నెంబర్లకు కాల్ చేయాలని కోరారు.


