News March 16, 2025
కరీంనగర్: రైలు పట్టాల పక్కన యువజంట మృతదేహాలు (UPDATE)

జమ్మికుంట(M) పాపయ్యపల్లి-బిజిగిరి షరిఫ్ గ్రామాల రైల్వే ట్రాక్ మధ్య శనివారం రాత్రి ఓ <<15773958>>యువజంట<<>> మృతదేహాలు లభ్యమైన విషయం తెలిసిందే. మృతిచెందిన యువకుడు ఇల్లందకుంట(M) రాచపల్లికి చెందిన మెనగు రాహుల్(18)గా గుర్తించారు. ప్రమాదంలో ఇద్దిరి తలలకు మాత్రమే గాయాలున్నాయి. ఒంటిపై ఎక్కడా గాయాలులేవు. దీంతో ఇది ఆత్మహత్య? లేక హత్య అనే పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
Similar News
News October 23, 2025
జూబ్లీహిల్స్లో రౌడీషీటర్ను ఓడించండి: KCR

TG: జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో మాగంటి సునీత గెలుపును ప్రజలు ఇప్పటికే ఖాయం చేశారని BRS చీఫ్ KCR పేర్కొన్నారు. ‘భారీ మెజారిటీ కోసం గట్టి ప్రయత్నం చేయాలి. రౌడీ షీటర్ ఫ్యామిలీ నుంచి వచ్చిన కాంగ్రెస్ అభ్యర్థిని ప్రజలు చిత్తుగా ఓడించి HYDలో శాంతి భద్రతలను కాపాడుకుంటారని విశ్వసిస్తున్నా’ అని వ్యాఖ్యానించారు. మాగంటి సునీత గెలుపుకోసం అనుసరించాల్సిన వ్యూహాలు, కార్యాచరణపై నేతలకు KCR దిశా నిర్దేశం చేశారు.
News October 23, 2025
ప్రజలకు సురక్షితమైన తాగునీటిని అందించండి: కలెక్టర్

కర్నూలు నగర ప్రజలకు సురక్షిత తాగునీటిని అందించాలని సంబంధింత అధికారులను కలెక్టర్ సిరి ఆదేశించారు. గురువారం సాయంత్రం కర్నూలు నగర శివారులోని సమ్మర్ స్టోరేజ్ ట్యాంకును పరిశీలించారు. ట్యాంక్ స్థితి, నీటి నిల్వను సమీక్షించారు. సమ్మర్ సిద్ధతలను దృఢంగా క్రమబద్ధం చేయాలని ఆదేశించారు. తక్షణ మరమ్మతులు, రక్షణ చర్యలపై అధికారులు దృష్టి పెట్టేలా సూచించారు. తాగునీటి సరఫరా సురక్షితం చేయడం ప్రధాన లక్ష్యమన్నారు.
News October 23, 2025
ఖనిజ రంగంలో సింగరేణి మరో ముందడుగుదడుగు

ఖనిజాల రంగంలో సింగరేణి మరో ముందడుగు వేసింది. సింగరేణి ప్రాంతంలో ఆ ఖనిజాల గుర్తింపు, ప్లాంట్ నిర్మాణంపై గురువారం కేంద్ర ప్రభుత్వ పరిశోధన సంస్థ ఎన్ఎఫ్టీడీసీతో ఒప్పందం కుదుర్చుకుంది. సంస్థ సీఅండ్ఎండీ బలరామ్ మాట్లాడుతూ… సింగరేణి ప్రాంతంలో లభ్యమవుతున్న రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ ఉనికిని తెలుసుకొని ఉత్పత్తి చేసేందుకు కొత్తగూడెంలో ప్రయోగాత్మక ప్లాంట్ ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు.