News February 7, 2025

కరీంనగర్: రోడ్డు ప్రమాదం.. కారు ఢీకొని రైతు మృతి

image

కొత్తపల్లి శివారులో గురువారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో రామడుగు మండలం వెలిచాల గ్రామానికి చెందిన రైతు జంగిలి అంజయ్య(65) మృతి చెందారు. కొత్తపల్లి సంతకు వచ్చి సామగ్రిని కొనుగోలు చేసి తిరిగి సైకిల్‌పై వెలిచాల వెళ్తుండగా ఎదురుగా వస్తున్న కారు ఢీకొట్టింది. దీంతో అంజయ్య తీవ్రగాయాలతో మృతి చెందారు. అంజయ్య మృతదేహాన్ని KNR ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి మార్చూరీలో భద్రపరిచామని పోలీసులు తెలిపారు.

Similar News

News December 18, 2025

రెచ్చిపోతున్న బంగ్లాదేశ్.. భారత్‌పై అక్కసు

image

బంగ్లాదేశ్ అవకాశం చిక్కినప్పుడల్లా భారత్‌పై విషం చిమ్ముతోంది. కొన్ని రోజుల క్రితం ఢాకా వర్సిటీలో PM మోదీ దిష్టిబొమ్మను దగ్ధం చేసి, ఆయనను దూషించారు. ఈశాన్య రాష్ట్రాలను(7 సిస్టర్స్) తమ దేశంలో కలిపేస్తామంటూ ఇద్దరు టాప్ స్టూడెంట్ లీడర్లు బహిరంగంగానే బెదిరింపులకు దిగారు. ఇవాళ ఢాకాలోని భారత ఎంబసీ వద్ద ఆందోళనకు దిగారు. యూనుస్ బంగ్లా తాత్కాలిక అధ్యక్షుడిగా వచ్చినప్పటి నుంచి ఈ ధోరణి కనబడుతోంది.

News December 18, 2025

ఓదెల సర్పంచ్‌గా డా.సతీష్ ఘన విజయం

image

ఓదెల గ్రామ పంచాయతీ సర్పంచ్‌గా డా.సతీష్ ఘన విజయం సాధించారు. ఈ సందర్భంగా ఆయనకు మద్దతుగా నిలిచిన గ్రామ ప్రజలు, నాయకులు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. గ్రామస్థులు డా.సతీష్‌కు శుభాకాంక్షలు చెప్పారు.

News December 18, 2025

పెద్దపల్లి జిల్లాలో ఉపసర్పంచ్ ఎన్నికలకు ఆదేశాలు

image

గ్రామ పంచాయతీల 2వ సాధారణ ఎన్నికల అనంతరం పెద్దపల్లి జిల్లాలో ఆరు గ్రామ పంచాయతీల్లో ఉపసర్పంచ్ ఎన్నికలు నిర్వహించేందుకు జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష ఉత్తర్వులు జారీ చేశారు. డిసెంబర్ 18న కమాన్‌పూర్, ముత్తారం, ధర్మారం, పాలకుర్తి, అంతర్గాం మండలాల్లోని గ్రామాల్లో ఎన్నికలు జరుగుతాయి. సంబంధిత ఎంపీడీఓలు, ఎంపీపీలు ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించారు. ఎన్నికల నిబంధనలను కట్టుదిట్టంగా పాటించాలని స్పష్టం చేశారు.