News February 2, 2025
కరీంనగర్ స్పోర్ట్స్ మీట్.. ఖోఖోలో సిరిసిల్ల థర్డ్ ప్రైజ్

కరీంనగర్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన మూడో పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్ పోటీల్లో రాజన్న సిరిసిల్ల జోన్ ఖోఖో విభాగంలో మూడో బహుమతి గెలుచుకుంది. తృతీయ బహుమతి పొందిన టీం కెప్టెన్ అల్లం రమేష్(ట్రాఫిక్ ఎస్ఐ) టీం సభ్యులను రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్, జిల్లా పోలీసు అధికారులు సిబ్బంది అభినందించారు.
Similar News
News November 15, 2025
తన గమ్యమేంటో జడేజాకు తెలుసు: రవిశాస్త్రి

తన ఫ్యూచర్(IPL)పై బయట జరుగుతున్న చర్చతో ఆల్రౌండర్ జడేజా ఫోకస్ దెబ్బతిందన్న వ్యాఖ్యలపై భారత మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి స్పందించారు. ‘అతని తర్వాతి డెస్టినేషన్, సంపాదన ఎంత అనే అంశాలపై అంతా ఆసక్తిగా ఉంటారు. జడేజా ఎంతో అనుభవజ్ఞుడు. టాప్ క్లాస్ క్రికెటర్. తన గమ్యం, క్రికెట్పై చాలా ఫోకస్డ్గా ఉంటాడు. బయట విషయాలు క్రికెట్పై అతనికున్న ఫోకస్ను దెబ్బతీయలేవు’ అని SAతో టెస్ట్ మ్యాచ్ సందర్భంగా అన్నారు.
News November 15, 2025
HYDలో పెరుగుతున్న వాయు కాలుష్యం..!

HYDలో వాయుకాలుష్యం, గాలిలో ధూళి కణాల సాంద్రత వృద్ధి చెందుతోంది. పర్టిక్యులేట్ మ్యాటర్ 242ను సూచిస్తుంది. మంచు, చల్లని గాలిలో ధూళికణాలు 4 నుంచి 8 అడుగుల ఎత్తులో అధిక మోతాదులో ఉంటాయని, దీంతో శ్వాసకోశ రోగాలు ప్రబలే అవకాశం ఉంటుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. నగరంలో మొత్తం 14 ప్రాంతాల్లో గాలినాణ్యతను కొలిచే యంత్రాలను PCB ఏర్పాటు చేసింది. కాగా, గాలినాణ్యత సూచి 100దాటితే ప్రమాదం ఉంటుందని PCB చెబుతోంది.
News November 15, 2025
సతీశ్ మృతి.. తండ్రిని కోల్పోయిన చిన్నారులు

పరకామణి కేసులో కీలకంగా వ్యవహరించిన <<18292672>>సతీశ్ హత్య<<>> రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపుతోంది. ఇప్పటికే పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేపట్టగా అటు పార్టీలు సైతం విమర్శలు గుప్పించుకుంటున్నాయి. అయితే దేవుడి సొమ్ము చోరీని బయటపెట్టిన తన భర్త ఆదేవుడి దగ్గరికే వెళ్లిపోయాడంటూ ఆకుటుంబం ఆవేదన వ్యక్తంచేసింది. సతీశ్కు భార్య మమత, ఇద్దరు ఆడ పిల్లలు ఉన్నారు. సతీశ్ మృతితో ఒక్కసారిగా ఆ కుటుంబం పెద్ద దిక్కును కోల్పోయింది.


