News April 24, 2024
కరీంనగర్: 12 నామినేషన్లు దాఖలు
కరీంనగర్ లోక్ సభ స్థానం నుంచి పోటీ చేసేందుకు మంగళవారం 12 మంది నామినేషన్లు దాఖలు చేశారు. ఇందులో ముగ్గురు రెండో సెట్ నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి తన ఛాంబర్లో అభ్యర్థుల నుంచి నామినేషన్ పత్రాలను స్వీకరించారు. హెల్ప్ డెస్క్ సిబ్బంది నామినేషన్ పత్రాలు నింపే అంశంలో అభ్యర్థులకు సహాయపడ్డారు. ఇందులో 10 మంది ఇండిపెండెంట్ అభ్యర్థులు ఉన్నారు.
Similar News
News January 25, 2025
కరీంనగర్ మేయర్ సునీల్ రావు చేరికపై స్పందించిన బండి సంజయ్
బీజేపీలో నగర మేయర్ సునీల్ రావు చేరనున్నట్లు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ప్రకటించారు. మేయర్ తో కలిసి మరికొంత మంది కార్పొరేటర్లు బీజేపీలోకి వస్తారన్న వార్తలపై బండి సంజయ్ స్పందించారు. బండి సంజయ్ సూచన మేరకు పరిమిత సంఖ్యలో కార్పొరేటర్లతో కలిసి బీజేపీలో మేయర్ సునీల్ రావు చేరుతున్నారు. భూ కబ్జాలు, నేరచరిత్ర ఉన్నవాళ్లను బీజేపీలో చేర్చుకోబోమని బండి సంజయ్ స్పష్టం చేశారు.
News January 24, 2025
స్మార్ట్ సిటీ ద్వారా KNR అభివృద్ధి అయ్యిందంటే.. అది బండి సంజయ్ వల్లే: మేయర్
స్మార్ట్ సిటీ పై కరీంనగర్ మేయర్ యాదగిరి సునీల్ రావు(బీఆర్ఎస్) సంచలన వ్యాఖ్యలు చేశారు. బండి సంజయ్ వల్లే కరీంనగర్కు రూ.428 కోట్ల స్మార్ట్ సిటీ నిధులు మంజూరయ్యాయని అన్నారు. 2017లోనే కరీంనగర్ ను ‘స్మార్ట్ సిటీ’గా ఎంపిక చేసినా నిధులు రాలేదు అని తెలిపారు. స్మార్ట్ సిటీ ద్వారా కరీంనగర్ అభివృద్ధి అయ్యిందంటే అది బండి సంజయ్ వల్లే అని అన్నారు.
News January 24, 2025
నేడు కరీంనగర్కు రానున్న కేంద్రమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్
కేంద్రమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ KNR లో పర్యటించనున్నారు. కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, మేయర్ తో కలిసి మల్టీపర్పస్ స్కూల్లో చేపట్టిన పార్కు పనులు, స్పోర్ట్స్ కాంప్లెక్స్ తో పాటు అనుబంధ పనులు, హౌసింగ్ బోర్డ్ కాలనీ 24/7 తాగునీటి సరఫరా, కుమ్మర్ వాడి హై స్కూల్ లో డిజిటల్ క్లాస్ రూమ్ ను ప్రారంభిస్తారు. బహిరంగ సభలో పాల్గొంటారు. డంపింగ్ యార్డ్ని సందర్శిస్తారు.