News February 28, 2025

కరీంనగర్: 2019లో 59.03%.. 2025లో 70.42%

image

ఉమ్మడి KNR, MDK, NZB, ADB పట్టభద్రులు, ఉపాధ్యాయ MLC ఎన్నికల పోలింగ్ నిన్న జరగగా.. మార్చి 3న కరీంనగర్‌లో లెక్కింపు జరగనుంది. అయితే, 2019లో పట్టభద్రుల పోలింగ్ 59.03శాతం నమోదు కాగా, 2025లో 70.42 శాతం నమోదైంది. ఉపాధ్యాయ పోలింగ్ 2019లో 83.54శాతం నమోదు కాగా, 2025లో 91.90శాతం పోలింగ్ జరిగింది. 2019 ఎన్నికలతో పోలిస్తే పట్టభద్రుల పోలింగ్ 11.39శాతం, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పోలింగ్ 8.36 శాతం పెరిగింది.

Similar News

News October 26, 2025

పాతపట్నం: కూతురిపై తండ్రి అఘాయిత్యం.. అబార్షన్ చేయడంతో మృతి

image

పాతపట్నం మండలం సరాళి గ్రామానికి చెందిన పోలాకి అప్పారావు హైదరాబాదులో ఒక అపార్ట్మెంట్ వద్ద వాచ్మెన్‌గా పనిచేస్తున్నాడు. 11 ఏళ్ళ కూతురిపై అఘాయిత్యం చేయడంతో గర్భవతి అయింది. అక్కడ ఉన్నవారికి తెలియకుండా శ్రీకాకుళం తీసుకొచ్చి అబార్షన్ చేయించగా ఆరోగ్యం వికటించడంతో విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. అక్కడ ఆమె మృతి చెందింది. అక్కడి వైద్యుల సమాచారం మేరకు పాతపట్నం ఎస్సై మధుసూదన రావు శనివారం కేసు నమోదు చేశారు.

News October 26, 2025

మహబూబ్‌నగర్: డిగ్రీ తొలి సెమిస్టర్ పరీక్ష ఫీజు గడువు విడుదల

image

పాలమూరు యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ మొదటి సెమిస్టర్ (రెగ్యులర్) పరీక్ష ఫీజు గడువును అధికారులు విడుదల చేశారు. విద్యార్థులు ఈ నెల 31వ తేదీలోగా తమ కళాశాలల్లో ఫీజు చెల్లించాలని సూచించారు. రూ.300 జరిమానాతో నవంబర్ 6వ తేదీ వరకు ఫీజు చెల్లించేందుకు అవకాశం ఉంటుందని యూనివర్సిటీ వర్గాలు తెలిపాయి.

News October 26, 2025

పుట్టపర్తి సత్యసాయి బాబా సూక్తులు

image

★ మానవుడు ప్రతి విషయంలోనూ పరిమితిని పాటించాలి. పరిమితి లేకుండా, క్రమశిక్షణ లేకుండా ప్రవర్తిస్తే అనేక పొరపాట్లు జరిగే అవకాశం ఉంది
★ సూర్యునివలే ప్రతి మానవుడు నిరహంకారిగా తయారుకావాలి
★ శ్రమించి పనిచేసే వారికి సర్వసంపదలు చేకూరుతాయి
★ చక్కెరలో నీటిని కలిపినప్పుడు పానకం అవుతుంది, దైవనామ స్మరణతో ప్రేమను కూర్చినప్పుడు అది అమృతం అవుతుంది.