News February 19, 2025

కరీంనగర్ : 28 నుంచి LLB పరీక్షలు

image

శాతవాహన విశ్వవిద్యాలయం పరిధిలోని మూడు సంవత్సరాల LLB పరీక్షల షెడ్యూల్‌ను విడుదల చేసినట్లు పరీక్షల నియంత్రణాధికారి శ్రీరంగ ప్రసాద్ తెలిపారు. మొదటి సెమిస్టర్ పరీక్షలు ఈ నెల 28 నుంచి మార్చి 5 తేదీ వరకు మధ్యాహ్నం 2గంటల నుంచి 5 గంటల వరకు జరగుతాయని పేర్కొన్నారు. పూర్తి వివరాలకు యూనివర్సిటీ వెబ్‌సైట్ చూడాలని, సంబంధిత కళాశాలలో సంప్రదించాలని సూచించారు.

Similar News

News October 27, 2025

HYD: ఎలక్ట్రిక్ బస్సుల సంఖ్య ఆ మార్గాల్లో పెంచాలని డిమాండ్

image

అంతర్రాష్ట్ర బస్సులు ప్రధానంగా హైదరాబాద్-విజయవాడ, హైదరాబాద్-బెంగళూరు మార్గాల్లో ఎక్కువగా నడుస్తున్నాయి. అలాగే విశాఖపట్నం, ముంబై, పూణే మార్గాల్లో కూడా రాకపోకలు కొనసాగుతున్నాయి. ఎలక్ట్రిక్ బస్సుల వైపు అనేక మంది ప్రయాణికులు మొగ్గు చూపుతుండగా.. వాటి సంఖ్యను ఆయా మార్గాల్లో పెంచాలని ప్రయాణికుల నుంచి డిమాండ్ పెరుగుతోంది.

News October 27, 2025

కరీంనగర్: దారుణం.. ‘బాలికల బాత్రూంలో కెమెరాలు’

image

గంగాధర మండలం కురిక్యాల జడ్పీ హైస్కూల్‌లో కీచక అటెండర్ అరాచకాలు బయటపడ్డాయి. బాలికల మూత్రశాలలో గోప్యంగా కెమెరాలు అమర్చి వీడియోలు చిత్రీకరించినట్లు ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. అనుమానాస్పద పరికరాన్ని గుర్తించిన బాలికలు తల్లిదండ్రులకు తెలపడంతో వారు పాఠశాల వద్ద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితుడిపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ ఘటనపై అధికారులు విచారణ చేపట్టారు.

News October 27, 2025

అన్నదాత సుఖీభవ.. ఆ రైతులకు గుడ్ న్యూస్

image

AP: వెబ్‌ల్యాండ్ రికార్డుల్లో ఆధార్ తప్పుల వల్ల ‘అన్నదాత సుఖీభవ’ పథకం 5.44L మంది రైతులకు ఆగిపోయింది. వీటిలో ప్రతి సవరణకు మీ సేవా కేంద్రాల్లో రూ.50 ఛార్జ్ ఉంది. అయితే పథకం ఆగిపోయిన అన్నదాతలంతా ఒకసారి ఉచితంగా సవరణ చేసుకోవడానికి ప్రభుత్వం అనుమతిచ్చింది. ఇందుకోసం మీసేవా ఛార్జీలు రూ.2.72 కోట్లను మాఫీ చేస్తూ ఉత్తర్వులిచ్చింది.
* రోజూ రైతులకు సంబంధించిన సమాచారం కోసం <<-se_10015>>పాడిపంట<<>> క్లిక్ చేయండి.