News July 31, 2024
కరీంనగర్: 6.35 కోట్ల మంది మహిళలు ఉచిత ప్రయాణం
కాంగ్రెస్ ప్రభుత్వం మహాలక్ష్మి పథకం కింద ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించింది. కాగా ఇప్పటి వరకు 6.35 కోట్ల మంది మహిళలు ప్రయాణించగా.. రూ.230.72 కోట్ల ఆదాయం వచ్చినట్లు కరీంనగర్ ఆర్ఎం సుచరిత తెలిపారు. ఆక్యుపెన్సీ రేషియో సైతం 85.33కు పెరిగినట్లు చెప్పారు. ప్రయాణికుల సంఖ్య పెరగడంతో రద్దీకి అనుగుణంగా బస్సులు నడుపుతున్నట్లు పేర్కొన్నారు.
Similar News
News October 8, 2024
పెద్దపల్లి: ఉపాధికి ఉడుంపట్టు.. కాటమయ్య రక్షణ కవచం
కల్లుగీత కార్మికుల ప్రాణ రక్షణకు రాష్ట్ర ప్రభుత్వం భరోసా కల్పిస్తోంది. గీత కార్మికులు చెట్టు ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు పట్టు జారకుండా ప్రత్యేక పరికరాలను అందజేస్తోంది. కాటమయ్య రక్షణ కవచం పేరిట ఆరు రకాల పరికరాల కిట్టును పంపిణీ చేస్తోంది. పెద్దపల్లి జిల్లాలో ఇప్పటికే ఉచిత శిక్షణ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. అవి పూర్తి కాగానే రక్షణ కవచాలను గీత కార్మికులకు ఉచితంగా అందజేయనుంది.
News October 8, 2024
KNR: సంతలో మహిళపై పండ్ల వ్యాపారి చెప్పుతో దాడి
కరీంనగర్ జిల్లా కేశవపట్నం వారసంతలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. సోమవారం సంతలో పండ్లు అమ్ముకునే వ్యక్తి పక్కనే పూలు అమ్ముకునే మహిళపై అసభ్యంగా తిడుతూ చెప్పుతో దాడి చేశాడు. అక్కడికి చేరుకున్న పోలీసులు గొడవ సద్దుమణిగేలా చేసి మహిళను అక్కడినుంచి పంపించారు. అయితే కొట్టిన వ్యక్తిని వదిలిపెట్టి దెబ్బలు తిన్న మహిళనే అక్కడినుంచి పంపేయడంతో పోలీసులు ఆ వ్యక్తికే వత్తాసు పలకడం పట్ల స్థానికులు విమర్శిస్తున్నారు.
News October 8, 2024
కరీంనగర్: నేడే ‘సద్దుల బతుకమ్మ’
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సాధారణంగా తొమ్మది రోజులకు సద్దుల బతుకమ్మ నిర్వహిస్తారు. కానీ, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని వేములవాడ సహా.. పలు ప్రాంతాల్లో మాత్రం ఏడు రోజులకే సద్దుల బతుకమ్మ నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ సందర్భంగా ఇక్కడి ఇంటి బిడ్డలు, కోడళ్లు.. 7, 9 రోజులకు రెండు సార్లూ సద్దుల బతుకమ్మలో పాల్గొంటారు. మరి మీ ప్రాంతంలో సద్దుల బతుకమ్మ ఎప్పుడో కామెంట్ చేయండి.