News March 28, 2024

కర్ణాటకలో నిజామాబాద్ దంపతుల ఆత్మహత్య

image

నిజామాబాద్ నగరానికి చెందిన దంపతులు కర్ణాటక రాష్ట్రంలో ఆత్మహత్యకు పాల్పడ్డారు. మృతులను గాయత్రీ నగర్ ప్రాంతానికి చెందిన మేడవరపు రాజు(55), మేడవరపు స్వాతి(53)గా పోలీసులు గుర్తించారు. వీరు కర్ణాటక రాష్ట్రంలోని కొడగు జిల్లా సోమవార్ పేట్ పరిధిలోని లాడ్జిలో సూసైడ్ చేసుకున్నారు. ఈ మేరకు నిజామాబాద్‌కు సమాచారం అందించారు. ఈ విషాద ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News April 10, 2026

ఆర్మూర్ మున్సిపల్ పరిధిలో భారీ చోరీ

image

​ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని పెర్కిట్ విశాఖ కాలనీలో గురువారం పట్టపగలే భారీ చోరీ జరిగింది. వినోద్ అనే వ్యక్తి తన కుమార్తె పెళ్లి నిమిత్తం గ్రామ దేవతల పూజకు కుటుంబంతో కలిసి వెళ్లగా, దుండగులు ఇంటి తాళం పగలగొట్టి లోపలికి చొరబడ్డారు. బీరువాలోని 14 తులాల బంగారం, లక్ష రూపాయల నగదు ఎత్తుకెళ్లారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News April 10, 2026

ఆర్మూర్: రాష్ట్రపతికి గ్రీన్ చాలెంజ్ ఇంటియాటివ్స్ పుస్తకం అందజేత

image

రాష్ట్రపతి భవన్‌లో భారత రాష్ట్రపతి ద్రౌపతి ముర్మును రాజ్యసభ సభ్యుడు, బీఆర్ఎస్ పార్లమెంటరీ నాయకుడు కె.ఆర్ సురేశ్ రెడ్డి గురువారం కలిసి గ్రీన్ చాలెంజ్ ఇంటియాటివ్స్ పుస్తకాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, పార్థసారథి, పార్లమెంట్ మాజీ సభ్యుడు సంతోష్ పాల్గొన్నారు.

News April 10, 2026

ఆర్మూర్: రాష్ట్రపతికి గ్రీన్ చాలెంజ్ ఇంటియాటివ్స్ పుస్తకం అందజేత

image

రాష్ట్రపతి భవన్‌లో భారత రాష్ట్రపతి ద్రౌపతి ముర్మును రాజ్యసభ సభ్యుడు, బీఆర్ఎస్ పార్లమెంటరీ నాయకుడు కె.ఆర్ సురేశ్ రెడ్డి గురువారం కలిసి గ్రీన్ చాలెంజ్ ఇంటియాటివ్స్ పుస్తకాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, పార్థసారథి, పార్లమెంట్ మాజీ సభ్యుడు సంతోష్ పాల్గొన్నారు.