News March 15, 2026
కర్నూలులో ‘ఆకలి కేక’

కమర్షియల్ గ్యాస్ కొరతతో హోటల్ కార్మికుల ఉపాధి సంక్షోభంలో పడిందని పేర్కొంటూ హోటల్, బేకరీ వంట మాస్టర్స్ యూనియన్(AITUC) ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ముందు శనివారం ధర్నా నిర్వహించారు. యూనియన్ అధ్యక్షుడు పురుషోత్తం అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో నాయకులు మాట్లాడారు. కమర్షియల్ గ్యాస్ సరఫరా సక్రమంగా జరిగేలా చూడాలని ప్రభుత్వాన్ని కోరారు. కార్మికులకు ఉపాధి భరోసా కల్పించాలన్నారు.
Similar News
News April 13, 2026
కర్నూలు: పోలీస్ PGRSకి 1122 అర్జీలు

కర్నూలు జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన PGRSలో బాధితుల నుంచి SP విక్రాంత్ పాటిల్ స్వయంగా వినతులు స్వీకరించారు. జిల్లావ్యాప్తంగా మొత్తం 112 ఫిర్యాదులు అందాయి. ఆర్థిక మోసాలు, బెదిరింపులు, అక్రమాలపై వచ్చిన ఫిర్యాదులను చట్టపరంగా విచారించి బాధితులకు త్వరితగతిన న్యాయం చేయాలని సంబంధిత అధికారులను ఎస్పీ ఆదేశించారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ హుస్సేన్ పీరా తదితరులు పాల్గొన్నారు.
News April 13, 2026
అర్జీలకు వెంటనే పరిష్కారం చూపాలి: కలెక్టర్

క్షేత్రస్థాయిలో ప్రజల సమస్యలను తెలుసుకొని అధికారులు ప్రతి అర్జీకి పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి ఆదేశించారు. సోమవారం కర్నూలు కలెక్టరేట్ నుంచి పిజిఆర్ఎస్ ద్వారా ప్రజల నుంచి వినతి పత్రాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అధికారులు తమ దృష్టికి వచ్చిన అర్జీలు పునరావృతం కాకుండా చూసుకోవాలన్నారు. నిర్ణీత గడువులోగానే సమస్యలకు పరిష్కారం చూపి బాధితులకు న్యాయం చేయాలని ఆమె ఆదేశించారు.
News April 13, 2026
కర్నూలు రేంజ్లో 25 మంది సీఐల బదిలీ

కర్నూలు రేంజ్ పరిధిలో భారీగా పోలీసు అధికారుల స్థానచలనం జరిగింది. పరిపాలన కారణాలతో 25 మంది సీఐలను బదిలీ చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. కర్నూలు, నంద్యాల, అనంతపురం, అన్నమయ్య, వైఎస్ఆర్ కడప జిల్లాలలో ఈ పోస్టింగ్లు ఇచ్చారు. పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ బోర్డు సిఫార్సుల మేరకు కొందరిని వీఆర్కు పంపారు. బదిలీ అయిన అధికారులు వెంటనే స్పందించి బాధ్యతలు స్వీకరించాలని ఉన్నతాధికారులు ఆదేశించారు.


