News December 30, 2024
కర్నూలులో కానిస్టేబుల్ అభ్యర్థుల ఈవెంట్స్ ప్రారంభం
కర్నూలులోని ఏపీఎస్పీ 2వ బెటాలియన్లో కానిస్టేబుల్ అభ్యర్థులకు ఇవాళ దేహదారుఢ్య (PMT/PET) పరీక్షలు ప్రారంభమయ్యాయి. తొలిరోజు 600 మంది అభ్యర్థులకు గాను 280 మంది అభ్యర్థులు బయోమెట్రిక్కు హాజరైనట్లు ఎస్పీ జీ.బిందు మాధవ్ తెలిపారు. కర్నూలు జిల్లాలో నిర్వహించే ఈ పరీక్షలకు 10,143 మంది అభ్యర్థులు పాల్గొంటారని వెల్లడించారు. ఈ మేరకు PMT/PET పరీక్షల తీరును ఆయన పరిశీలించారు.
Similar News
News January 16, 2025
నీటి ఎద్దడి లేకుండా తగిన చర్యలు చేపట్టండి: మంత్రి టీజీ భరత్
రానున్న వేసవి కాలంలో నీటి ఎద్దడి లేకుండా తగిన చర్యలు చేపట్టండి రాష్ట్ర మంత్రి టీజీ భరత్ అన్నారు. గురువారం కర్నూలు ప్రభుత్వ అతిథి గృహంలో జిల్లా కలెక్టర్ పీ.రంజిత్ బాషా, ఎస్పీతో కలిసి ఆయా శాఖల అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు. అధికారులు, ప్రజా ప్రతినిధులు సమన్వయంతో పని చేయాలని కోరారు.
News January 16, 2025
బేతంచర్లలో పేడ రంగు తాగి మహిళ ఆత్మహత్య
ఇంటి ముందు కల్లాపు చల్లుకునే పేడ రంగు తాగి మహిళ మృతి చెందిన ఘటన బేతంచెర్ల మండలం పెండేకల్లో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన కొట్టాల మహేశ్వరి(22) ఇంట్లో ఎవరూ లేని సమయంలో పేడ రంగును నీటిలో కలుపుకొని తాగింది. దీంతో అపస్మారక స్థితిలో ఉన్న మహేశ్వరిని ఆసుపత్రికి తరలించగా మృతి చెందినట్లు బంధువులు వాపోయారు. పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని బనగానపల్లెకు తరలించి కేసు నమోదు చేశారు.
News January 16, 2025
ఉపాధి వేతన దారులకు పనులు కల్పించండి: కలెక్టర్
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ప్రతి గ్రామపంచాయతీలో ప్రతిరోజు వంద మంది ఉపాధి వేతనదారులకు పనులు కల్పించి నిర్దేశించిన లేబర్ బడ్జెట్ మొబిలైజేషన్ లక్ష్యాన్ని సాధించాలని అధికారులను కలెక్టర్ జీ.రాజకుమారి ఆదేశించారు. గురువారం నంద్యాల కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్ నుంచి ఉపాధి హామీ పథకం కింద నిర్దేశించిన లేబర్ బడ్జెట్, హౌసింగ్ మ్యాండేస్, సచివాలయ సర్వీసులపై సమీక్షించారు.