News March 4, 2025

కర్నూలులో ఘోర ప్రమాదం.. రిటైర్డ్ వార్డెన్ మృతి

image

కర్నూలులో ఇవాళ ఉదయం ఘోర ప్రమాదం జరిగింది. కోడుమూరు మండలం వెంకటగిరికి చెందిన రిటైర్డ్ హాస్టల్ వార్డెన్ కృష్ణారెడ్డి డీ మార్ట్ వైపు వాకింగ్‌కు వెళ్లిన సమయంలో గుర్తుతెలియని వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆయన అక్కడికక్కడే మృతిచెందారు. కృష్ణారెడ్డి కోడుమూరు మండలం లద్దగిరిలో హాస్టల్ వార్డెన్‌గా పనిచేస్తూ పదవీ విరమణ పొందారు. ప్రస్తుతం కర్నూలులో నివాసం ఉంటున్నారు. ఈ ఘటనతో కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Similar News

News March 4, 2025

కర్నూలు జిల్లాలో నేటి ముఖ్య వార్తలు

image

➤ కర్నూలు: వలస కూలీల కొడుకు ఎస్ఐగా ఎంపిక ➤ డిగ్రీ విద్యార్థి అదృశ్యం ➤ త్వరలో కౌతాళంలో 100 పడకల ఆసుపత్రి➤ మంత్రాలయం శ్రీ మఠానికి పోటెత్తిన భక్తులు➤ ఇంటర్ పరీక్షల్లో ఏడుగురు డీబార్➤ క్లస్టర్ యూనివర్సిటీ వీసీకి ఆత్మీయ వీడ్కోలు➤ అసెంబ్లీల బడ్జెట్‌పై ఎమ్మిగనూరు ఎమ్మెల్యే ప్రసంగం➤ కర్నూలులో ఘోర ప్రమాదం.. రిటైర్డ్ వార్డెన్ మృతి ➤ రాష్ట్రస్థాయి పవర్ లిఫ్టింగ్‌లో కేజీబీవీ విద్యార్థుల ప్రతిభ

News March 4, 2025

ఆటో డ్రైవర్ కూతురికి ఎస్ఐ ఉద్యోగం

image

బేతంచెర్లకు చెందిన శేషాద్రి, నాగలక్ష్మి దంపతుల కుమార్తె నిర్మల ఎస్ఐగా ఎంపికయ్యారు. శేషాద్రికి ఐదుగురు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. ఆటో డ్రైవర్‌గా జీవనం కొనసాగిస్తున్న శేషాద్రి.. తన మూడో కుమార్తె నిర్మలను బీటెక్ వరకు చదివించారు. ఎస్ఐగా ఎంపికై అనంతపురం పోలీస్ శిక్షణ కార్యాలయంలో శిక్షణ పూర్తి చేసుకుని శ్రీ సత్యసాయి జిల్లాలో పోస్టింగ్ పొందారు. ఈ సందర్భంగా పలువురు నిర్మలను అభినందించారు.

News March 4, 2025

రెవెన్యూ అధికారులు నిర్లక్ష్యం వీడాలి: సీపీఎం

image

దేవనకొండ మండలంలో రెవెన్యూ అధికారుల నిర్లక్ష్య ధోరణిపై సీపీఎం నాయకుడు బీ.వీరశేఖర్ తహశీల్దార్ కార్యాలయంలో బైఠాయించారు. తెర్నేకల్ గ్రామానికి చెందిన మాబాషా అనే రైతుకు 7 ఎకరాల వ్యవసాయ పొలంలో 27 సెంట్లు హంద్రీనీవా కాలువ కింద పోయిందని, మిగిలిన 6 ఎకరాల 63 సెంట్లు పట్టాదారు పాసు బుక్కులో ఎక్కించాల్సి ఉండగా రీ సర్వే పేరుతో ఆలస్యం చేస్తున్నారనిధ్వజమెత్తారు.

error: Content is protected !!