News February 21, 2025
కర్నూలులో జీబీఎస్ కేసు నమోదు

కర్నూలులో తొలి గిలియన్ బార్ సిండ్రోమ్ (జీబీఎస్) కేసు నమోదైంది. నగరంలోని భగత్సింగ్నగర్కు చెందిన గోకారమ్మ (46) అనారోగ్యంతో బాధపడుతూ ఆసుపత్రిలో చేరగా వైద్యులు పరీక్షలు నిర్వహించారు. జీబీఎస్ ఉన్నట్లు నిర్ధరించారు. దీంతో ఆమెను ప్రత్యేక వార్డుకు తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే ఈ వ్యాధి అంటువ్యాధి కాదని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే.
Similar News
News January 9, 2026
12, 13 తేదీల్లో నగరవ్యాప్తంగా శానిటేషన్ డ్రైవ్

పర్యావరణ పరిరక్షణతో పాటు సుస్థిర పారిశుద్ధ్య లక్ష్యంగా GHMC స్వచ్ఛ భారత్ మిషన్లో భాగంగా మెగా ఈవేస్ట్ శానిటేషన్ డ్రైవ్ను 12, 13 తేదీల్లో నగరవ్యాప్తంగా 300 వార్డుల్లో నిర్వహించనుంది. ఈడ్రైవ్ ద్వారా ప్రజల్లో ఎలక్ట్రానిక్ వ్యర్థాల నిర్వహణపై అవగాహన కల్పించడంతో పాటు, నివాస, వాణిజ్య, ప్రజా ప్రాంతాల నుంచి ఈవేస్ట్ను సేకరించి శాస్త్రీయంగా ప్రాసెస్ చేస్తారు.
News January 9, 2026
మహిళలూ.. ఈ లక్షణాలున్నాయా? జాగ్రత్త

క్యాన్సర్ లక్షణాలు అన్నిసార్లూ బయటకు కనిపించవు. ముఖ్యంగా మహిళల్లో కొన్ని క్యాన్సర్లు నిశ్శబ్ధంగా శరీరంలో వ్యాపిస్తాయంటున్నారు నిపుణులు. చాలా క్యాన్సర్లను ప్రారంభదశలో గుర్తించడం కష్టమని చెబుతున్నారు. అందుకే మహిళల్లో అసాధారణ వాపు, దీర్ఘకాల అలసట, కారణం లేకుండా బరువు తగ్గడం, చర్మంపై మార్పులు, అసాధారణ రక్తస్రావం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు.
News January 9, 2026
AIIMS పట్నాలో 117 పోస్టులు.. అప్లైకి రేపే లాస్ట్ డేట్

AIIMS పట్నాలో 117 సీనియర్ రెసిడెంట్(నాన్ అకడమిక్) పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. పోస్టును బట్టి MBBS/MD/MS/DNB/DM/M.Ch ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. అభ్యర్థుల గరిష్ఠ వయసు 45ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్లో సడలింపు ఉంది. షార్ట్ లిస్టింగ్, రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్సైట్: https://api.aiimspatna.edu.in/


