News March 27, 2025
కర్నూలులో నేడే ఎన్నికలు

కర్నూలు జిల్లా బార్ అసోసియేషన్ ఎన్నికలు గురువారం జరగనున్నట్లు ఎన్నికల అధికారి సీనియర్ న్యాయవాది సీ.ప్రభాకర్ రెడ్డి తెలిపారు. జిల్లా బార్ అసోసియేషన్ కార్యాలయంలో ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. అధ్యక్షుడి రేసులో హరినాథ్ చౌదరి, మురళీ మోహన్, సంపత్ కుమారి, జనరల్ సెక్రటరీ రెసులో ఆంజనేయులు, కృష్ణమూర్తి, వెంకటేశ్వర్లు, జాయింట్ సెక్రటరీ రేసులో బాల సుబ్రహ్మణ్యం, నాగరాజు ఉన్నారని తెలిపారు.
Similar News
News April 20, 2025
కానిస్టేబుల్ హత్య కేసులో నిందితుల అరెస్ట్

మంగళగిరిలో ఏపీఎస్పీ కానిస్టేబుల్గా పనిచేస్తున్న మున్నా ఫరూక్ హత్య కేసులో ఐదుగురు నిందితులను అరెస్ట్ చేసినట్లు సిరివెళ్ల సీఐ దస్తగిరి బాబు, ఎస్సై చిన్నపీరయ్య తెలిపారు. నంద్యాలకు చెందిన షేక్ షబ్బీర్ బాషా ప్రియురాలిపై కానిస్టేబుల్ ఫరూక్ అసభ్యంగా ప్రవర్తించాడన్న కోపంతో హత్య చేశారని తెలిపారు. మృతదేహాన్ని గిద్దలూరు అటవీ ప్రాంతంలో పడేశారని వివరించారు. నిందితులను రిమాండ్కు తరలించినట్లు పేర్కొన్నారు.
News April 20, 2025
ఆదోని మెడికల్ కాలేజీపై ఆరోగ్యశాఖ మంత్రి స్పందన

కర్నూలు జీజీహెచ్లో అవసరమైన ఐపీ బ్లాక్ నిర్మిస్తామని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ అన్నారు. కర్నూలు ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి వైద్యులు, సిబ్బందితో శనివారం ఆయన సమీక్ష నిర్వహించారు. నిర్మాణ దశలో ఉన్న క్రిటికల్ కేర్ బ్లాక్ను త్వరలోనే పూర్తిచేసి అందుబాటులోకి తెస్తామన్నారు. ఆదోని మెడికల్ కాలేజీని అన్ని వసతులతో వచ్చే ఏడాది అందుబాటులోకి తీసుకొస్తామని స్పష్టం చేశారు.
News April 19, 2025
ఆదోని మెడికల్ కాలేజీపై ఆరోగ్యశాఖ మంత్రి స్పందన

కర్నూలు జీజీహెచ్లో అవసరమైన ఐపీ బ్లాక్ నిర్మిస్తామని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ అన్నారు. కర్నూలు ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి వైద్యులు, సిబ్బందితో శనివారం ఆయన సమీక్ష నిర్వహించారు. నిర్మాణ దశలో ఉన్న క్రిటికల్ కేర్ బ్లాక్ను త్వరలోనే పూర్తిచేసి అందుబాటులోకి తెస్తామన్నారు. ఆదోని మెడికల్ కాలేజీని అన్ని వసతులతో వచ్చే ఏడాది అందుబాటులోకి తీసుకొస్తామని స్పష్టం చేశారు.