News February 14, 2025

కర్నూలులో బర్డ్ ఫ్లూ తొలి కేసు.. రెడ్ జోన్‌గా ప్రకటన

image

కర్నూలులో తొలి బర్డ్ ఫ్లూ కేసు నమోదైంది. నగరంలోని నరసింహారావు పేటలో నమోదైనట్లు KMC ఆరోగ్య శాఖ అధికారులు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. దీంతో నరసింహారావు పేట, పరిసర ప్రాంతాలను రెడ్ జోన్‌గా ప్రకటించినట్లు వెల్లడించారు. సంకల్ప్ బాగ్‌లో ఓ వ్యక్తి తన నివాసంలో కోడిని పెంచుకుంటున్నాడు. ఈ క్రమంలో ఉన్నట్టుండి ఆ కోడి చనిపోవడంతో పరీక్షలు చేయించాడు. పరీక్షలో బర్డ్ ఫ్లూ సోకినట్లు తేలడంతో అధికారులు అప్రమత్తమయ్యారు.

Similar News

News December 4, 2025

HYD సీపీ ఎమోషనల్ పోస్ట్

image

డబ్బు మత్తులో.. బంధాలు ఛిద్రం అవుతున్నాయని నగర సీపీ సజ్జనార్ ఎమోషనల్ పోస్ట్ చేశారు. కరీంనగర్ జిల్లా రామడుగులో రూ.4 కోట్లకు బీమా చేయించి అన్నను తమ్ముడు ఘోరంగా హతమార్చాడు. ఈ ఘటనలో ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. దీనిపై సజ్జనార్ స్పందించారు. ‘ఏ బ్యాంక్ బ్యాలెన్స్ గుండె చప్పుడును కొనలేదు. ఏ బీమా పాలసీ పోయిన ప్రాణాన్ని తిరిగి తేలేదు’ అని పేర్కొన్నారు.

News December 4, 2025

తిరుపతి SVUలో ఇంత దారుణమా..?

image

తిరుపతి SVU పరిధిలో 1991 నుంచి 2015 వరకు డిగ్రీ చదివిన వాళ్లు సప్లిమెంటరీ పరీక్షలు రాసుకోవడానికి గతేడాది ఆగస్టులో నోటిఫికేషన్ ఇచ్చారు. ఒక్కో పేపర్‌కు రూ.2వేలు, 3పేపర్లకు మించితే రూ.4వేలు చొప్పున ఫీజు కట్టించుకున్నారు. ఇప్పటి వరకు పరీక్షల షెడ్యూల్ ఇవ్వలేదు. డబ్బులు కట్టి సంవత్సరం దాటుతున్నా పరీక్షల తేదీ వెల్లడించకపోవడంతో SVUలో ఇంత దారుణమా? అని అందరూ విమర్శిస్తున్నారు. దీనిపై మీ కామెంట్.

News December 4, 2025

MDK: ఎన్నికల దావత్‌కు.. అందరూ ఆహ్వానితులే!

image

గ్రామపంచాయతీ ఎన్నికలకు నగర మోగింది. అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. ఐతే ఉమ్మడి మెదక్ జిల్లా గ్రామాల్లో ఎన్నికల దావత్‌లు కూడా ప్రారంభమయ్యాయి. అభ్యర్థులు తమ అనుచరులు తమవెంట ఉండాలని ప్రతి రోజు దావత్‌లు ఇస్తున్నారు. ఇక పల్లెల్లో ముక్క, చుక్కలకు కొదువ లేదు. ఉదయం టిఫిన్‌లతో సహా రాత్రి దావత్‌ల వరకు ఎలాంటి డొక లేకుండా అందరూ ఆహ్వానితులే.. అంటున్నారు. మీ ప్రాంతాల్లో ఎలా ఉంది.