News March 15, 2025

కర్నూలులో హత్య.. పాత కక్షలే కారణమా?

image

కర్నూలులో TDP నేత సంజన్న <<15763975>>హత్య<<>> కలకలం రేపింది. శరీన్‌నగర్‌లో ఉంటున్న సంజన్నకు స్థానికంగా అంజితో ఆధిపత్యపోరు ఉంది. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి ఇంటికి వెళ్తున్న సంజన్నపై దండగులు కత్తులతో దాడి చేసి హత్య చేశారు. విషయం తెలుసుకున్న సంజన్న వర్గీయులు ఆంజి వాహనంపై దాడికి పాల్పడటంతో ఉద్రిక్తత నెలకొంది. అంజి వర్గీయులే ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Similar News

News October 14, 2025

కర్నూలు జిల్లా గిరిజన సంక్షేమ ఆఫీసర్‌గా సురేష్

image

కర్నూలు జిల్లా గిరిజన సంక్షేమ అధికారిగా దేవల్ల సురేష్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ..గిరిజన సంక్షేమ హాస్టల్లో వసతులు మెరుగుపడేలా, ఎలాంటి అసౌకర్యం రాకుండా గిరిజన సంక్షేమ హాస్టల్లో అభివృద్ధి చేసేలా కృషి చేస్తానని తెలిపారు. సురేష్ గతంలో అనంతపూర్ గిరిజన సంక్షేమ కార్యాలయంలో సూపరింటెండెంట్‌గా విధులు నిర్వహిస్తూ డీటీడబ్ల్యూఓగా పదోన్నతి పొంది కర్నూలుకు బదిలీ అయ్యారు.

News October 13, 2025

మంత్రాలయంలో 727 టీచర్ పోస్టులు భర్తీ

image

మంత్రాలయం నియోజకవర్గానికి అత్యధికంగా 727 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయడం హర్షనీయమని టీడీపీ ఇన్‌ఛార్జ్ రాఘవేంద్రరెడ్డి తెలిపారు. ఆదివారం మంత్రాలయం మండలం మాధవరంలో ఆయన మాట్లాడారు. మెగా డీఎస్సీ ద్వారా తన నియోజకవర్గంలో ఎక్కువ ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయడంపై మంత్రి లోకేశ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. మంత్రాలయంలో 121, పెద్దకడబూరులో 92, కోసిగిలో 256, కౌతాళంలో 257 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయడం జరిగిందన్నారు.

News October 13, 2025

ప్రధాని పర్యటన ఏర్పాట్లు పకడ్బందీగా జరగాలి: CM

image

ప్రధాని నరేంద్ర మోదీ జిల్లా పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లు ఎటువంటి లోపం లేకుండా పకడ్బందీగా నిర్వహించాలని CM చంద్రబాబు నాయుడు జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు. ఆదివారం విజయవాడ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఏర్పాట్లపై సీఎం సమీక్ష నిర్వహించారు. కర్నూలు నుంచి స్పెషల్‌ ఆఫీసర్‌ వీర పాండేన్‌, జిల్లా కలెక్టర్‌ ఎ.సిరి, ఎస్పీ విక్రాంత్‌ పాల్గొని వివిధ అంశాలపై చర్చించారు.