News April 18, 2024

కర్నూలు: అన్ని గ్రామాల్లో ఉపాధి పనులు

image

జిల్లాలోని అన్ని గ్రామాల్లో ఉపాధి పనులు చేపట్టనున్నట్లు డ్వామా పీడీ అమరనాథరెడ్డి తెలిపారు. జిల్లాలో మొత్తం 690 గ్రామాలు ఉండగా ఇప్పటికే.. 662గ్రామాల్లో పనులు సాగుతున్నాయని పేర్కొన్నారు. కొన్ని గ్రామాల్లో వారం వ్యవధిలో పనులు కల్పించేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. రోజుకు 1,53,500 మందికి పనులు కల్పించాలనేది లక్ష్యం కాగా.. 98,058 మంది ఉపాధి పనులకు హాజరవుతున్నారని పేర్కొన్నారు.

Similar News

News February 28, 2026

కర్నూలు: ‘ఏప్రిల్ నాటికి 23,077 గృహాలకు సోలార్’

image

కర్నూలు కలెక్టరేట్ కార్యాలయంలో విద్యుత్ శాఖాధికారులు, కాంట్రాక్టర్లతో జిల్లా కలెక్టర్ సిరి సమీక్ష నిర్వహించారు. పీఎం సూర్యఘర్ పథకం కింద జిల్లాలోని 23,077 ఎస్సీ/ఎస్టీ లబ్ధిదారుల ఇళ్లపై ఏప్రిల్ నాటికి సోలార్ ఇన్‌స్టాలేషన్లు పూర్తి చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఇన్వర్టర్లు, మీటర్లు, ఎర్త్ వైరింగ్‌లో నాణ్యత పాటించాలన్నారు. పెండింగ్‌లో ఉన్న పీఎం కుసుమ్ పనులను వెంటనే ప్రారంభించాలన్నారు.

News February 28, 2026

కర్నూలు: ‘ఈ ఏడాదికి 45 లక్షల మొక్కలు నాటాలి’

image

కర్నూలు కలెక్టరేట్‌లో శనివారం 2026-27 ఆర్థిక సంవత్సరంలో చేపట్టబోయే Plantation గురించి జిల్లా కలెక్టర్ సిరి శనివారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. 2026-27 ఆర్థిక సంవత్సరంలో జిల్లా వ్యాప్తంగా భారీ ఎత్తున ప్లాంటేషన్ కార్యక్రమాన్ని చేపట్టాలని, అందుకుగాను 45 లక్షల మొక్కలను నాటడమే లక్ష్యంగా ప్రణాళికలు సిద్ధం చేయాలని కలెక్టర్ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు.

News February 28, 2026

మార్చి 2న కలెక్టరేట్‌లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక

image

మార్చి 2న ఉదయం 9:30 గంటలకు కర్నూలు కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియంలో ‘ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక’ నిర్వహించనున్నట్లు కలెక్టర్ డా.ఏ.సిరి తెలిపారు. అర్జీల స్థితిగతుల కోసం 1100 కాల్ సెంటర్ నుంచి సమాచారం పొందవచ్చన్నారు. ప్రజలు తమ ఫిర్యాదులను ఆన్‌లైన్ వెబ్‌సైట్ ద్వారా కూడా నమోదు చేసుకోవచ్చని సూచించారు. జిల్లా ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.