News February 16, 2025
కర్నూలు, ఆదోనిలో ఎండు మిర్చి ధరల వివరాలు

కర్నూలు, ఆదోని వ్యవసాయ మార్కెట్లలో శనివారం శనివారం ఎండు మిర్చి ధరలు ఈ విధంగా ఉన్నాయి. ఆదోని వ్యవసాయ మార్కెట్లో క్వింటా గరిష్ఠ ధర రూ.13,236 పలకగా.. కనిష్ఠ ధర రూ.2,200 పలికింది. కర్నూల్లో కనిష్ఠంగా రూ.3,500 పలకగా.. గరిష్ఠంగా రూ.12,813 పలికినట్లు ఆయా మార్కెట్ల ఎంపిక శ్రేణి అధికారులు తెలిపారు.
Similar News
News December 9, 2025
కృష్ణా: బీ.ఫార్మసీ పరీక్షల టైం టేబుల్ విడుదల

కృష్ణా యూనివర్శిటీ(KRU) పరిధిలోని కళాశాలల్లో బీ.ఫార్మసీ(2017 రెగ్యులేషన్) చదివే విద్యార్థులు రాయాల్సిన 5వ సెమిస్టర్ పరీక్షల టైం టేబుల్ విడుదలైంది. DEC 29, 31, JAN 2, 5, 7వ తేదీలలో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు వర్శిటీ పరిధిలోని 3 కళాశాలలలో ఈ పరీక్షలు నిర్వహిస్తామని KRU అధ్యాపకులు తెలిపారు. పూర్తి వివరాలకు https://kru.ac.in/ వెబ్సైట్ చూడాలని కోరారు.
News December 9, 2025
గద్వాల్: మద్యం మత్తులో దాడులు.. ముగ్గురికి తీవ్రగాయాలు

గద్వాల జిల్లా కేంద్రంలోని కృష్ణవేణి చౌక్ సమీపంలో సోమవారం అర్ధరాత్రి మద్యం మత్తులో ముగ్గురు యువకులు పరస్పరం కత్తులతో దాడి చేసుకున్నారు. ఈ దాడిలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఒకరి పరిస్థితి విషమంగా ఉండటంతో కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గద్వాల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాలి. రాత్రి మద్యం సేవించడంతోనే ఈ పరిస్థితి వచ్చిందని స్థానికులు అంటున్నారు.
News December 9, 2025
కామారెడ్డి: ‘అన్నా నమస్తే.. ఊరికొస్తున్నావా’

కామారెడ్డి జిల్లాలో తొలి విడతలో 167 పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈక్రమంలో ఎన్నికలకు మరో ఒక్క రోజే గడువు ఉండడంతో అందుబాటులో లేని స్థానిక ఓటర్లకు అభ్యర్థులు పదేపదే కాల్స్ చేస్తున్నారు. చాలా మంది రాజధాని పరిధిలోని HYD,రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలకు వివిధ పనుల నిమిత్తం వెళ్లారు. వారికి కాల్ చేసి ‘అన్నా నమస్తే.. ఊరికొస్తున్నావ్ కదా.. నాకే ఓటేయాలి’ అంటూ ఆన్లైన్లో డబ్బులు చెల్లిస్తున్నారని సమాచారం.


