News February 16, 2025

కర్నూలు, ఆదోనిలో ఎండు మిర్చి ధరల వివరాలు

image

కర్నూలు, ఆదోని వ్యవసాయ మార్కెట్లలో శనివారం శనివారం ఎండు మిర్చి ధరలు ఈ విధంగా ఉన్నాయి. ఆదోని వ్యవసాయ మార్కెట్లో క్వింటా గరిష్ఠ ధర రూ.13,236 పలకగా.. కనిష్ఠ ధర రూ.2,200 పలికింది. కర్నూల్లో కనిష్ఠంగా రూ.3,500 పలకగా.. గరిష్ఠంగా రూ.12,813 పలికినట్లు ఆయా మార్కెట్ల ఎంపిక శ్రేణి అధికారులు తెలిపారు.

Similar News

News October 22, 2025

కార్తీక మాసంలో ఇలా చేస్తే ఎంతో పుణ్యం

image

కార్తీక మాసం నదీ స్నానాలు, దీపారాధనతోనే కాక నియమ నిష్ఠలతో కూడిన వ్రతాల ద్వారా కూడా ఎంతో పుణ్యాన్నిస్తుంది. ఈ నెల రోజుల్లో శివకేశవులను పూజించడం శ్రేయస్కరం. దేవాలయాలు, ఉసిరి చెట్టు కింద దీపాలు వెలిగించడం వల్ల మోక్షం లభిస్తుంది. శక్తి ఉన్నవారు ఉపవాసం ఆచరించాలి. సోమవారాలతో పాటు పౌర్ణమి, ఏకాదశి రోజుల్లో రుద్రాభిషేకాలు, తులసి పూజ, కార్తీక పురాణ పారాయణం చేయడం వల్ల కోటి జన్మల పుణ్యం లభిస్తుందని నమ్మకం.

News October 22, 2025

పశువుల్లో గాలికుంటు వ్యాధి లక్షణాలు

image

ఈ వ్యాధి సోకిన పశువులకు గిట్టల మధ్య బొబ్బలు ఏర్పడతాయి. 3, 4 వారాల్లో బొబ్బలు పగిలి పుండ్లుగా మారతాయి. చర్మం గరుకుగా మారి నోటి చిగుళ్లపై పొక్కులు ఏర్పడటం వల్ల పశువులు మేత మేయలేవు. నీరసంగా ఉంటాయి. పశువుకు 104 నుంచి 105 డిగ్రీల ఫారన్ హీట్ వరకు జ్వరం ఉంటుంది. పాడిగేదెల్లో పాల దిగుబడి గణనీయంగా తగ్గిపోతుంది. ఎద్దుల్లో రోగ నిరోధకశక్తి తగ్గి అలసటకు గురై నీరసంగా మారతాయి.

News October 22, 2025

అందుకే అలా మాట్లాడా: నిర్మాత రాజేశ్

image

నిన్న ఓ వెబ్‌సైట్‌పై <<18065234>>ఫైరయిన<<>> ‘K RAMP’ నిర్మాత రాజేశ్ దండా తన వ్యాఖ్యలను సమర్థించుకున్నారు. ‘రేటింగ్ ఇవ్వడంపై అభ్యంతరం లేదు. కానీ ఆదరణ పెరిగాక నెగటివ్ వార్తలు రాయడం బాధించింది. నేను వాడిన భాష అభ్యంతరకరం అంటున్నారు. రూ.కోట్లు ఖర్చుచేసిన నా సినిమాను చంపేసే ప్రయత్నం చేస్తుంటే కోపం రాదా.. నేనూ మనిషినే కదా. అందుకే అలా మాట్లాడా. సినీ జర్నలిస్టులంటే నాకు ఎప్పుడూ గౌరవమే’ అని ట్వీట్ చేశారు.